AP: పిఠాపురంలో IAS కృష్ణతేజ పర్యటన.. పంచాయతీ సమస్యలపై ఫోకస్‌..!

పిఠాపురంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ పర్యటించారు. పంచాయతీల్లో సమస్యలపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని చందుర్తి గ్రామస్తులు కృష్ణతేజకు ఫిర్యాదు చేశారు.

New Update
AP: పిఠాపురంలో IAS కృష్ణతేజ పర్యటన.. పంచాయతీ సమస్యలపై ఫోకస్‌..!

Pawan Kalyan: పిఠాపురంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ పర్యటించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో పిఠాపురంతో పాటు జగ్గంపేట ఏరియాలోనూ కృష్ణతేజ పర్యటించనున్నారు. పంచాయతీల్లో సమస్యలపై స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. నేరుగా పొలాల దగ్గరకొచ్చి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు.

గొల్లప్రోలు మండలం వన్నెపూడి, చందుర్తి గ్రామాల్లో పర్యటించారు. గులాబి, జామ తోటలను పరిశీలించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. జనసేన లోకల్‌ లీడర్ల తీరుపై చందుర్తి గ్రామ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను నేతలు పట్టించుకోవట్లేదని చందుర్తి ప్రజలు అసంతృప్తి చెందారు. నేతల తీరు పవన్‌ కల్యాణ్‌పై ప్రభావం చూపుతుందంటున్నారు గ్రామస్తులు.

కొన్ని రోజులుగా పిఠాపురంలో అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల క్రితం సముద్ర కోత నివారణకు.. ఉప్పాడ పంచాయతీలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. నిన్న పిఠాపురం కలెక్టర్‌, ఆర్డీవో పర్యటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు