Telangana Elections: హైకమాండ్ అనుకుంటే జరిగేదిదే.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ అనుకుంటే తానే సీఎం అవుతానని ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఆయన.. హైకమాండ్ అనుకుంటే సీఎం ను అవుతానని అన్నారు.

New Update
Telangana Elections: హైకమాండ్ అనుకుంటే జరిగేదిదే.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

CM Candidate Janareddy: మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ అనుకుంటే తానే సీఎం(Janareddy) అవుతానని ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఆయన.. హైకమాండ్ అనుకుంటే సీఎం ను అవుతానని అన్నారు. మంగళవారం పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress) చెప్పింది గ్యారెంటీగా ఇచ్చే స్కీమ్‌లేనని అన్నారు. కేసీఆర్ ప్రకటించినవి ప్రజలను మోసం చేసే పథకాలు అని అన్నారు. ఇదే సమయంలో పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడటంపై జానారెడ్డి స్పందించారు. పొన్నాల పార్టీని వీడటం బాధాకరం అన్నారు. పొన్నాల లక్ష్మయ్యను పార్టీ అన్ని విధాలా గౌరవించిందన్నారు.

ఇదికూడా చదవండి: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా?

ఇక వామపక్షాలతో మైత్రి విషయంపై స్పందించిన జానారెడ్డి.. వామపక్షాల కోసం కొన్ని చోట్ల కాంగ్రెస్ త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తాం అనేదిది గోబెల్స్ ప్రచారం మాత్రమేనని అన్నారు. కరెంట్ విషయంలో పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మాట్లాడింది ఒకటయితే.. సీఎం కేసీఆర్ మరోలా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు జానారెడ్డి. డబ్బు మద్యం పంచకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము ఉందా? అని బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు జానారెడ్డి.

ఇదికూడా చదవండి: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

New Update
whatsapp

whatsapp Photograph: (whatsapp)

Whatsapp: మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్‌ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్‌ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

ఉదయం యూపీఐ సేవలు..

యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

business | meta | Facebook Meta | instagram | facebook-instagram-down | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment