Mango : మామిడి పళ్లు సహజంగా పండినవి.. కృతిమంగా పండినవి ఎలానో గుర్తించండి!

కృత్రిమంగా పండించిన మామిడిలో చాలా తక్కువ  రసం ఉంటుంది. అయితే ఆర్గానిక్ మామిడిలో చాలా 'సహజ రసం' ఉంటుంది. కృత్రిమంగా పండిన మామిడిలో, చర్మం దగ్గర ఉన్న తొడెం రంగు, లోపల ఉన్న దానికి భిన్నంగా ఉంటుంది., కానీ సహజంగా పండిన మామిడి మొత్తం పసుపు రంగులో ఉంటుంది.

New Update
Health Tips : మామిడి పండు తినే అరగంట ముందు ఇలా చేయండి..లేకపోతే చాలా ప్రమాదం!

Mango's Without Adulteration : వేసవి కాలం(Summer) వచ్చేసింది... పండ్లకు రారాజు అయినటువంటి మామిడి పళ్లు(Mango)  మార్కెట్లో కనపడతున్నాయి. మంచిగా నోరూరిస్తూ పసుపు రంగులో రండి రండి అంటూ పిలుస్తున్నాయి. ఇంకేముంది ఆ వాసనకు , ఆ రంగులకు ఎంత ధరైనా పెట్టి మామిడి కాయలను కొని ఇంటికి తీసుకుని వచ్చిన తరువాత అవి పాడైపోయి... కుళ్లిపోయినట్లు తెలిస్తే.. ఇక అంతే సంగతులు.

అంతేకాకుండా.. పండు కృతిమ రసాయనాలను(Synthetic Chemicals) ఉపయోగించి పండించినవి అయితే అవి అంతగా తీపి అనిపించవు.. అంతేకాకుండా వాటిని తినడం వల్ల కొత్త రోగాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే కొనేటప్పుడే మంచి కాయలను ఎంచుకొని ఇంటికి తెచ్చుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి పండ్లను కృతిమ పద్దతిలో పండించడానికి ఉపయోగించే కాల్షియం కార్బైడ్‌ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Food Safety & Standards Authority Of India)  ఎప్పుడో నిషేధించింది. మామిడి పండ్లను కృత్రిమంగా పండించే ప్రక్రియలో తరచుగా ఎసిటిలీన్ వాయువు విడుదలవుతుందని తెలుస్తుంది. కాల్షియం కార్బైడ్ వినియోగదారులకు ప్రమాదకరంగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

అసలు సహజంగా పండిన మామిడి పండు ఎలా ఉండాలి అంటే... “ మామిడి పండు అండాకారంగా, బీన్ ఆకారంలో ఉండాలి. ముఖ్యంగా కాండం చుట్టూ వాసన చూసినప్పుడు తీపి వాసనను అనుభవించాలి. రసాయనికంగా పండిన మామిడిపండ్లు ఉపరితలంపై పసుపు , ఆకుపచ్చ మచ్చలను కలిగి ఉంటాయి, అయితే సహజంగా పండిన మామిడి ఆకుపచ్చ, పసుపు ఏకరీతి మిశ్రమాన్ని కలిగి ఉంటుంది.

మామిడి సహజంగా పండినదా లేదా అని ఎలా గుర్తించాలి?
మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో ఉంచండి.
మామిడిపండ్లు నీటిలో మునిగి ఉంటే, అవి సహజంగా పండినట్లు భావించండి.
అవి తేలుతూ ఉంటే, వాటిని కృత్రిమంగా పండించినట్లు గుర్తించాలి.
“కృత్రిమంగా పండించిన మామిడిలో చాలా తక్కువ  రసం ఉంటుంది. అయితే ఆర్గానిక్ మామిడిలో చాలా 'సహజ రసం' ఉంటుంది. మరొక సంకేతం ఏమిటంటే, ఒకసారి సగానికి కట్ చేస్తే, మీరు కృత్రిమంగా పండిన మామిడిలో, చర్మం దగ్గర ఉన్న తొడెం రంగు, లోపల ఉన్న దానికి భిన్నంగా ఉంటుంది, కానీ సహజంగా పండిన మామిడి మొత్తం పసుపు రంగులో ఉంటుంది.

సరైన మామిడిని ఎలా ఎంచుకోవాలి?
విశ్వసనీయ విక్రేతల నుండి మాత్రమే కొనుగోలు చేయండి.
తినడానికి ముందు పండ్లను శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి.
చర్మంపై నల్ల మచ్చలు ఉన్న పండ్లను కొనుగోలు చేయడం మానుకోండి, ఎందుకంటే ఈ పండ్లు కాల్షియం కార్బైడ్ నుండి ఉత్పత్తి చేసిన ఎసిటలీన్ గ్యాస్ ద్వారా పండినవి.

Also read: ఈసారి రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది..చంద్రోదయ సమయం,ప్రాముఖ్యత.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్.. భారత్, చైనా దోస్తీ

ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.

New Update
Trump and Jinping

Trump and Jinping

వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీసా రూల్స్‌ను ఆయన మరింత కష్టతరం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రతీకార సుంకాలతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ అవకాశాన్ని  చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు వీసా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.  

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

అంతేకాదు భారత పౌరుల కోసం చైనా చాలావలకు వీసా సడలింపులు చేసింది. ఆ దేశాన్ని ప్రయాణాన్ని మరింత ఈజీగా చేసింది. భారతీయులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా వీసా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ రోజులు చైనాలో ప్రయాణించే వాళ్లకి బయోమెట్రిక్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇది వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.  

చైనా వీసా తక్కువ ధరకు దొరకడం వల్ల భారతీయలకు ప్రయాణం మరింత సులవుగా మారింది. వీసా జారీ చేసేందుకు పట్టే సమయాన్ని కూడా తగ్గించేశారు. ఇది వ్యాపార,విహార యాత్రకు వెళ్లేవాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చైనా, భారత పర్యాటకులకు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, పర్యాటక ప్రదేశాలను ఇది ప్రోత్సహిస్తోంది. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ట్రేడ్‌వార్ మొదలుపెట్టారు. దీంతో చైనా భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు ద్వైపాక్షిక లాభాలపై ఆధారపడి ఉన్నాయని చైనా దౌత్యవాణిజ్య ప్రతినిధి యూ జింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' చరిత్రలో ప్రతీకార సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో ఎవరూ గెలవలేదు. ప్రపంచ దేశాలు అన్నీకలిసి సంప్రదింపులు, బహుళపక్ష సూత్రాలపై నిలపడి ఏకపక్ష చర్యలు, రక్షణవాద విధానాలకు వ్యతిరేకంగా ఉండాలని'' అన్నారు.  

 rtv-news | trump | china | national-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు