AP: ముచ్చుమర్రి గ్రామానికి హోం మంత్రి అనిత.. వారం గడుస్తున్న కనిపించని బాలిక డెడ్బాడీ..! నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి హోం మంత్రి వంగలపూడి అనిత వెళ్లనున్నారు. మైనర్ బాలిక హత్య నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి.. మృతదేహాన్ని మల్యాల లిప్ట్ కెనాల్లో పడేసి వారం గడుస్తున్న డెడ్బాడీ దొరకలేదు. By Jyoshna Sappogula 16 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nandyal: ఏపీలో నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నందికొట్కూరు నియోజకవర్గం పగిడాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో వారం రోజుల క్రితం బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి.. మృతదేహాన్ని మల్యాల లిప్ట్ కెనాల్లో పడేశారు. Also Read: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..! అయితే, అధికారులకు ఇప్పటికీ ఆ బాలిక డెడ్బాడీ దొరకలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా, ముచ్చుమర్రి గ్రామానికి హోం మంత్రి వంగలపూడి అనిత వెళ్లనున్నారు. ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. #ap-home-minister-anitha సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి