AP: ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆందోళన.. వైద్య సిబ్బందితో మృతుల బంధువులు వాగ్వివాదం.! ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆందోళన నెలకొంది. ఇష్టారాజ్యంగా పోస్టుమార్టం చేస్తున్నారంటూ దువ్వూరు తెలుగు గంగ ప్రాజెక్టులో మరణించిన మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. పోస్టుమార్టం విషయమై డాక్టర్ గోపాల్ను బాధితులు చితకబాదినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 30 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన నెలకొంది. దువ్వూరు తెలుగు గంగ ప్రాజెక్టులో మరణించిన మృతుల బంధువులు వైద్య సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఇష్టారాజ్యంగా పోస్టుమార్టం చేస్తున్నారంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం విషయమై డాక్టర్ గోపాల్ ను మృతుల బంధువులు చితకబాదారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపుచేసే ప్రయత్నం చేశారు. దీంతో మృతుల బంధువులు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. #kadapa సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి