KTR: కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. కోర్టులో పిటిషన్!

మేడిగడ్డ బ్యారేజీపై అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

New Update
KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ!

KTR Bail Petition: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడం, పార్టీ నేతల ఫిరాయింపుల, కూతురు కవిత అరెస్ట్ తో సతమతమవుతున్న కేసీఆర్ కు మరో సమస్య ఎదురుకానుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా మేడిగడ్డ బ్యారేజీపై (Medigadda Barrage) అనుమతి లేకుండా డ్రోన్ (Drone) ఎగురవేశారని కేటీఆర్‌తో సహా పలువురిపై కేసు నమోదైంది. ఈ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

మేడిగడ్డపై అపోహలు వద్దని..

ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఓటమికి ఒక కారణమైన మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో  తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుకుంది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు (Kaleshwaram Project) కూడా వరద భారీగా చేరుకుంది. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విఫలమైందని.. ఇక పని చేయదని ఆనాడు ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేశాయి. ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై  చేసిన ఆరోపణలను తప్పు అని నిరూపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్ (KTR) అధ్యక్షతన కుంగిన మేడిగడ్డ ప్రాజెక్ట్ ను  సందర్శించారు. ఈ క్రమంలో ప్రజలకు ప్రాజెక్ట్ ను చూపించేందుకు డ్రోన్ ఎగరవేశారు. ఈ క్రమంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని కేటీఆర్ తో సహా పలువురుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: హైదరాబాద్ లో ఆ 56 చెరువులు మాయం.. ఎక్కడెక్కడ ఎంత మింగారంటే?

రేవంత్.. రివెంజ్..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పై ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డ్రోన్ ఎగరవేశారు. నదిని ఆక్రమించి హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆనాడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ ఇల్లీగల్ గా డ్రోన్ ఎగురవేశారని రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. రేవంత్ ఈ కేసులో అరెస్ట్ కూడా అయ్యారు. కాగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడం.. సీఎం హోదాలో రేవంత్ ఉండదంతో కేటీఆర్ పై ఆయన రివెంజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అదే డ్రోన్ కేసు తరహాలో కేటీఆర్ ను కూడా జైలు జీవితం అనుభవించేలా రేవంత్ కార్యాచరణ చేపట్టారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మరి ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారా? లేదా?అనేది వేచి చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..

బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన  దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. 

author-image
By Manogna alamuru
New Update
india

Pakistan Started Firing

పాకిస్తాన్ కయ్యానికి కాలు తెగ దువ్వుతోంది. ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్ లో టూరిస్టుల ప్రాణాలు పోయేలా చేసిందే కాకుండా ఇప్పుడు భారత్ తో యుద్దం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది. ఇండియా సంయమనంతో ఉండాలని చూస్తోంది కానీ ఆ దేశం మాత్రం అలా అనుకోవడం లేదు. నిన్న రాత్రి నుంచి నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల తో చెలరేగిపోతోంది. అయితే దీనికి సిద్ధంగానే ఉన్న భారత సైన్యం వాటికి ధీటుగా సమాధానమిస్తోంది. భారత్, పాక్ సీజ్ ఫైర్ ఎత్తేసారని వార్తలు వచ్చాయి. అయితే ఇరు దేశాలు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు పాకిస్తాన్ చర్యల వలన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉంది.  

కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు..

పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత దేశం మొత్తం కోపంతో రగిలిపోతోంది. ఈ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ఇందులో సింధు జల ఒప్పందం, పాకిస్తానీయుల వీసాల రద్దు, భారతదేశం నుంచి పాకిస్తానీయులు వెళ్ళిపోవాలని వంటి ఆంక్షలను విధించింది.ఇదే సమయంలో ఉగ్రదాడికి పాల్పడిన వారు, దానికి సహకరించిన వాళ్ళు కూడా 'నాశనం' చేయబడతారని ప్రధాని మోదీ గురువారం స్పష్టం చేశారు.  ఇంత జరిగినా పాక్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. భారత్ లానే ఆ దేశం కూడా ఒప్పందాలను రద్దు చేసుకుంది. దౌత్య సంబంధాలను తెగ్గొట్టుకుంది. అదికాక ఇప్పుడు బార్డర్ లో కాల్పులకు తెర తీసింది. నిన్న రాత్రి నుంచి పలు చోట్ల కాల్పులు జరుపుతూనే ఉంది పాక్ సైన్యం. అయితే ఇప్పటికే సిద్ధంగా భారత సిపాయిలు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని ఆర్మీ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు రఫెల్ యుద్ధ విమానాలు కూడా బయలుదేశాయి. అలాగే సముద్రంలో ఐఎన్ఎస్ నౌక యుద్ధానికి రెడీగా ఉంది. 

కాశ్మీర్‌కు ఆర్మీ చీఫ్‌

తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్విదేది నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. శ్రీనగర్‌, ఉదమ్‌పూర్‌లో పర్యటించనున్నారు. కశ్మీర్‌ లోయలోని ఆర్మీ కమాండర్లు, మిగతా భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.

today-latest-news-in-telugu | india | pakistan | border | firing

Advertisment
Advertisment
Advertisment