Shirdi: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ట్రస్ట్‌ బోర్డు!

షిర్డీ ఆలయానికి భక్తులు విరాళాలు, కానుకల రూపంలో ఇచ్చిన బంగారు, వెండి వస్తువులను కరిగించి నాణేలు, పతకాల రూపంలో భక్తులకు అందించాలని షిర్డీ సాయిబాబా దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

New Update
Shirdi: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ట్రస్ట్‌ బోర్డు!

షిర్డీ సాయిబాబా భక్తులు నిత్యం పెద్ద సంఖ్యలో బాబాని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం షిర్డీ సాయిబాబా టెంపుల్‌ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాబాకి కానుకల రూపంలో వచ్చే బంగారు, వెండి ఆభరణాలను కానీ, నిల్వలను కరిగించి భక్తులకు విక్రయించాలని నిర్ణయం తీసుకుంది.

అయితే దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో షిర్డీ సాయినాథుని ఆలయం ఒకటి. షిర్డీ బాబాకు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ వ్యాప్తంగా కాకుండా...విదేశాల నుంచి సైతం వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే షిర్డీ సాయికి భారీగా విరాళాలు ఇస్తుంటారు. కొంతమంది భక్తులు నగదుతో పాటు వస్తువులు, బంగారం, వెండి రూపంలో కానుకలను అందజేస్తుంటారు. ఇలా భక్తులు సమర్పించిన కానుకల్లో 450 కిలోలు బంగారం, 6 వేల కిలోల వరకు వెండి ఆలయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉంది.

ఈ క్రమంలోనే దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు బంగారం, వెండిని కరిగించి పతకాలు, నాణేలను తయారు చేసి వాటిని అమ్మలనకుంటున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం గురించి తుల్జాపూర్‌ భవానీ దేవస్థానం కూడా పరిశీలిచి..సభ్యులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలువురు బోర్డు సభ్యులు మాట్లాడుతూ..ఆలయానికి వచ్చిన కానుకల్లో 450 కిలోల బంగారం, 6 వేల వరకు వెండి ఉందని తెలిపారు.

దీనిలోనుంచి 155 కిలోల బంగారం, 6 వేల కిలోల వెండిన కరిగించి...5, 10 గ్రాముల నాణెలు, పతకాలను తయారు చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దీని కోసం మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు సభ్యులు వివరించారు. అనుమతులు వచ్చిన వెంటనే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు.

Also read: ఇప్పటి వరకు 20 సార్లు పెళ్లి చేసుకున్నా..కానీ బోర్‌ కొట్టలేదంటున్న నటి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు