Gold Rates : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం!

బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్‌. మంగళవారం మార్కెట్‌ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది.

New Update
Gold Rate Today: బంగారం ధరల్లో మార్పులు లేవు.. ఈరోజు ఎంతుందంటే.. 

Gold Rates Today : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ గా పెళ్లిళ్లు(Marriages) జరుగుతున్నాయి. చాలా కాలం తరువాత ముహుర్తాలు ఉండడంతో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. సుమారు ఈ సీజన్ లో 42 లక్షల వివాహాలు జరగనున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ క్రమంలో బంగారం కొనే వారు కూడా విపరీతంగా పెరిగారు. పెళ్లి అంటేనే నగలు. మగువలు పెళ్లిలో మరింత అందంగా కనిపించేందుకు నగలనే ఎంచుకుంటారు.

ఈ క్రమంలో బంగారం కొనాలి అనుకునే వారికి అదిరిపోయే న్యూస్‌. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు(Gold Rates) తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం మార్కెట్‌ లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారంతో పోల్చుకుంటే రూ.10 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 590 లకు చేరుకుంది.

Gold And Silver Rates : 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62, 830 లుగా ఉంది. వెండి కిలో కు రూ. 100 తగ్గి.. రూ. 74, 400 వద్ద స్థిరపడింది. మంగళవారం మార్కెట్లో బంగారం , వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57, 590 లుగా ఉండగా... 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 62,830 లుగా ఉన్నట్లు సమాచారం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,930 లుగా కొనసాగుతుంది. ఇక కోల్ కత్తా(Kolkata) లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 57, 590 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,830 లుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,090 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర పై రూ. 63, 370 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 57, 590 లుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 62,830 లుగా ఉంది. బంగారం ధరలు ఇలా ఉండగా.. వెండి కూడా బంగారం దారిలోనే నడిచింది. కిలో పై రూ. 100 తగ్గుముఖం పట్టి రూ. 74,400 గా ఉంది. ఇదే ధర ఢిల్లీ(Delhi), ముంబై(Mumbai), కోల్ కతాలో కూడా కొనసాగుతున్నాయి.

చెన్నై, కేరళ, హైదరాబాద్‌(Hyderabad) లో రూ. 75,900 లుగా ఉండగా, బెంగళూరులో రూ. 72,600 లుగా ఉంది.

Also Read : దుస్తులు మురికిగా ఉన్నాయంటూ.. రైతును మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు

ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

New Update
 Man Marries Two Women

 Man Marries Two Women Photograph

 

wedding card
wedding card Photograph: (wedding card)

 Man Marries Two Women: ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజానికి అన్ని పెళ్లి కార్డుల్లాగే అది కూడా సాధారణమైన కార్డే. కానీ వరుడు ఒక్కడు.. వధువులు ఇద్దరు కావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ కార్డు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఒకే హీరోను ఇద్దరు అక్కచెల్లెళ్లు ఇష్టపడడం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. సినిమాల్లోనూ చివరికి ఎవరో ఒకరు త్యాగం చేయడం సర్వసాధారణం కానీ సత్యసాయి జిల్లాకు చెందిన ఒక వరుడికి అక్కాచెల్లెళ్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఒకే ముహూర్తంలో, ఒకే మండపంలో అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకునేందుకు వరుడు సిద్ధమయ్యాడు. బంధువులు, సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ శుభలేఖలు కూడా ప్రింట్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

 శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మగారిపల్లికి చెందిన గంగులమ్మ రాజువేలు కుమారుడు గంగరాజుకు.. కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి టౌన్‌కు చెందిన కె సుశీల రఘుల కుమార్తెలు శ్రీలక్ష్మి, ఐశ్వర్యలను ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లు కార్డులో ప్రింట్ చేశారు. ఈ నెల 10న ఉదయం ముహూర్తం కాగా.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణం బెంగళూరు రోడ్, గుమ్మ్యగారిపల్లి క్రాస్ దగ్గర ఉన్న రంగమహాల్‌లో పెళ్లి చేస్తున్నారట. పెళ్లికి ముందు రోజు అంటే ఈ నెల 9న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కాచెల్లెళ్లను ఒకే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడం వెనుక కారణం ఏంటని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకకు సరిహద్దులో ఉంటుంది.. దీంతో స్థానికులు కొందరు ఉపాధి కోసం కర్ణాటకకు వెళ్లి అక్కడే స్థిరపడతారు.. పొరుగునే ఉన్న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటారు.. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన యువకుడ్ని కర్ణాటకకు చెందిన ఇద్దరు వధువులతో పెళ్లి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆయనకిద్దరు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వెడ్డింగ్ కార్డ్ పోస్ట్ కింద నెటిజన్లు స్పందిస్తున్నారు. 'లోకం మారుతోంది అంటే ఏంటో అనుకొన్న, ఈ వెడ్డింగ్ చూసి నిజమనిపిస్తోంది.. ఒకేసారి ఇద్దరమ్మాయిల ముద్దుల మొగుడుగా.. తమ్ముడు గంగరాజు నీ గుండె పది కాలాలు బ్రతకాలి' అంటూ వెడ్డింగ్ కార్డును షేర్ చేశారు ఓ నెటిజన్. 

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి


'పేరు మారింది కావచ్చు. అందుకే అలా రాసారేమో' అని ఒక నెటిజన్ అంటే.. 'ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త రా బాబు... నీ ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటాయి. ఆ.విషయంలో ఇద్దరినీ మెయింటైన్ చేయాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని అనుకో.. ముందు ధూమపానం మద్యపానం వంటి అలవాట్లు ఉంటే మానుకో.. లేకపొతే ముందు ముందు ఆ రెండు వ్యసనాలకు శాశ్వతంగా బానిస కావాల్సి ఉంటుంది.. జాగ్రత్త' అని మరొకరు సలహా ఇస్తూ రిప్లై ఇచ్చారు. 'ఒక్కరిని కట్టుకున్నాందుకే బాధపడుతుంటే, మరి నీ పరిస్థితి ఏంటి? గట్టి గుండె అనిచెప్పాలి' అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు. అయితే ఇద్దరిలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉన్నాయోమో అందుకే ఒకరికే ఇచ్చి పెళ్లి చేస్తున్నారని మరొకరు కామెంట్‌ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

#sri-sathya-sai-district #womens #marriage
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు