Madhya Pradesh : 200 అడుగుల బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి!

మధ్యప్రదేశ్‌లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది.బావిలో పడిన బాలికను రైతు పింటూ సాహు కుమార్తె శౌమ్యగా అధికారులు గుర్తించారు.పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ చిన్నారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.

New Update
Madhya Pradesh : 200 అడుగుల బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి!

3 Years Old Girl Fall Into Borewell : మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ చిన్నారి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.

సాయంత్రం 4 గంటలకు పాప పుట్టినరోజు (Birthday) వేడుకల కోసం బంధువులు , తల్లిదండ్రులు అంతా సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం పాప 18-20 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. పైపుల ద్వారా బావిలోకి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. బోరుబావి 200 అడుగుల లోతు ఉన్నట్లు సమాచారం. బావిలో పడిన బాలికను రైతు పింటూ సాహు కుమార్తె శౌమ్యగా అధికారులు గుర్తించారు.

ఘటన జరిగిన వెంటనే బోరుబావి నుంచి బాలికను రక్షించేందుకు రెస్క్యూ కార్యక్రమాలను అధికారులు మొదలు పెట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. బాలికను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీబీల ద్వారా బోరుబావి (Borewell) కి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. సాహు ఇంటికి సమీపంలో గతేడాది బోరు వేసినప్పటికీ నీరు పడకపోవడంతో బోరు బావిని మట్టితో కప్పేశారు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు మట్టి కిందకు దిగడంతో బావిలో 20-25 అడుగుల గుంత ఏర్పడింది.

Also read:  ఆటో డ్రైవర్‌ తో గొడవ..గుండె ఆగి చనిపోయిన శివసేన నేత కుమారుడు!


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?

తెలంగాణలో చపాతీలు తిన్న వెంటనే తల్లీ కొడుకు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. పుడ్ పాయిజన్ కారణమని కొందరు, మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

New Update
Rajanna siricilla

Rajanna siricilla Photograph: (Rajanna siricilla)

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రుద్రంగి మండలంలో ఓ తల్లి కొడుకు చపాతీలు తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. తల్లి కొడుకు ఇద్దరూ కూడా చికిత్స తీసుకుంటూ.. మృతి చెందారు. తల్లీకొడుకులు చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

అత్తింటి వేధింపులు భరించలేక..

వీరి మృతికి పుడ్ పాయిజన్ కారణం అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

ఇదిలా ఉండగా ఇటీవల బెట్టింగ్ వల్ల ఓ యువకుడు మృతి చెందాడు. కాకినాడ జిల్లా తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బెట్టింగ్‌కు బానిసైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ వేస్తూ అప్పుల్లో కూరుకుపోయిన కొలనాటి మరణబాబు రైలు కింద పడి చనిపోయాడు. మృతుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. రమణబాబు ఉద్దండపురం గ్రామంలో ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు.

ఇది కూడా చూడండి: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

సోమవారం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమణబాబు పూర్తిగా బెట్టింగ్‌కు బానిసై జీతం డబ్బులు కూడా ఇంటికి ఇవ్వకపోయేది. బెట్టింగ్స్ వేస్తూ అప్పులపాలైన రమణబాబు అప్పుల బాధ బరించలేక ఇక తనకు చావే దిక్కనుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Advertisment
Advertisment
Advertisment