Ayodhya : అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా? మీకో గుడ్ న్యూస్..ఈ జిల్లా నుంచి నేరుగా రైలు.. పూర్తి వివరాలివే..!!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈ నెల 11వ తేదీన సామార్లకోట కాకినాడ, సామార్లకోట నుంచి అయోధ్య వేళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు రైల్వే శాఖ. సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖ మీదుగా ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది.

New Update
Trains Cancelled: వందేభారత్‌ తో పాటు 22 రైళ్లు రద్దు!

Ayodhya : యావత్ ప్రపంచం గర్వించే విధంగా అయోధ్య(Ayodhya) లోని శ్రీరామ ప్రాణప్రతిష్ట(Prana Pratishtha) జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నుంచే కాదు ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ప్రాణప్రతిష్ట అనంతరం సామాన్యులకు దర్శనం చేసుకునే భాగ్యం కల్పించారు. అప్పటి నుంచి దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. విమానాలు, రైళ్ల ద్వారా జనం అయోధ్య బాట పడుతున్నారు. భక్తుల రద్దీని ద్రుష్టి లో ఉంచుకుని రైల్వే శాఖ కొన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు యూపీ వెళ్లాలంటే రెండు రైళ్లు మారాల్సి ఉండేది.

అయితే ఇప్పుడు నేరుగా సామాన్య ప్రాంతాల నుంచి కూడా అయోధ్య కు వెళ్లి శ్రీరాముడిని దర్శనం చేసుకుని మరలా తిరిగి అదే రైల్లో వారి స్వగ్రామాలకు వచ్చే విధంగా ప్రత్యేక రైలు(Special Train) ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఇంతకీ ఆ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడి నుంచి రైలు ప్రారంభం అవుతుందో తెలుసుకుందాం.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి(Rajahmundry) లేదా సామర్లకోట, తుని ఈ రైల్వే స్టేషన్లో అయోధ్య లేదా కాశీ క్షేత్రానికి వెళ్లాలనుకుంటే రెండు రైళ్లు మారాల్సి ఉండేది. రాజమండ్రి, నుంచి విశాఖ వరకు ఒక రైలు... విశాఖ(Vizag) నుంచి భువనేశ్వర్ వరకు మరొకరైలు.. భువనేశ్వర్ నుంచి కాశీ లేదా అయోధ్యకు మరో రైలు మారాల్సి వచ్చేది. అయితే ప్రతిఒక్కరూ అయోధ్య దర్శనం చేసుకునే విధంగా రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈ నెల 11వ తేదీన సామార్లకోట కాకినాడ, సామార్లకోట నుంచి అయోధ్య వేళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు రైల్వే శాఖ. సామర్లకోట, తుని, అనకాపల్లి, విశాఖ మీదుగా ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది. తిరిగి 14వ తేదీన ప్రారంభమై సామర్లకోటకు చేరుకుంటుంది.

ఇది కూడా చదవండి: టీఎస్ ఎడ్ సెట్ 2024 షెడ్యూల్ విడుదల..రాతపరీక్షతేదీ ఇదే..!!

రెండవది రాజమండ్రి నుంచి ప్రారంభమయ్యే రైలు పూర్తి వివరాలు పూర్తిస్థాయిలో రైల్వే శాఖ తెలియజేయనప్పటికీ గుంటూరు నుంచి మరో రైలు ప్రారంభమై రాజమండ్రి సామర్లకోట తుని అనకాపల్లి మీదుగా ఈ రైలు ప్రయాణం కొనసాగుతుంది. రెండు నుంచి మూడు రైళ్లు మారకుండా ఉమ్మడి జిల్లాల నుంచే ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండటంతో సామాన్యభక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో పప్పుకు పురుగు పడుతుందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Terror Attack Vijayawada: ఉలిక్కిపడ్డ 'బెజవాడ'.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు..!

పహల్గాం దాడి దృష్ట్యా విజయవాడలో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. SIMI అనుచరులుగా భావిస్తున్న నలుగురిని గుర్తించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలోని అనుమానిత ప్రాంతాలలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాయి.

New Update
Terror Attack Vijayawada

Terror Attack Vijayawada

Terror Attack Vijayawada: జమ్మూ కశ్మీర్‌లోని(Jammu and Kashmir) పహల్గాం(Pahalgam) ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిచింది. ఈ దాడి నేపథ్యంలో దేశంలోని అనేక నగరాల్లో పోలీస్‌ విభాగాలు అప్రమత్తమయ్యాయి. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కూడా ఉగ్రవాద కదలికలపై పోలీసులు   నిఘా పెట్టారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసారు.

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

విజయవాడ టార్గెట్‌గా..!

కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే రెండు నెలల క్రితమే విజయవాడను టార్గెట్‌గా ఉంచుకుని ఉగ్ర ముప్పు పొంచి ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో, నగరంలోని కొందరు వ్యక్తులపై పోలీస్‌ శాఖ నిఘా పెంచింది. తాజా సమాచారం ప్రకారం, సిమి (SIMI) తీవ్రవాద సంస్థకు మద్దతు పలికే నలుగురు అనుమానితులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఈ నలుగురిని పట్టుకోవాలనే ఉద్దేశంతో నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బీపేట ప్రాంతాల్లో పోలీసులు విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వారి కదలికలపై పక్కాగా నిఘా పెట్టారు. విచారణలో ఇంకా నలుగురు సిమి అనుచరులు విజయవాడలో తలదాచుకుని ఉన్నట్లు తెలిపారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ప్రస్తుతం మొత్తం ఎనిమిది మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి చిన్న సమాచారం‌ను జాగ్రత్తగా విశ్లేషిస్తూ, ఉగ్రవాద ముప్పును అడ్డుకునేందుకు నిఘా సంస్థలు, స్థానిక భద్రతా దళాలు కలిసి పని చేస్తున్నాయి.

దేశ భద్రతను సవాల్ చేసేలా మారుతున్న ఉగ్రవాద కదలికలను ముందే గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులు, పోలీస్ యంత్రాంగం  ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి సంబంధించిన పరిణామాలు ఇంకా చల్లారకముందే, విజయవాడ వంటి శాంతియుత నగరాల్లో ఉగ్ర ముప్పు వార్తలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment