AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ A 71గా ఉన్నారు. వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ అయ్యారు. By Jyoshna Sappogula 02 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vallabhaneni Vamsi Mohan: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ A 71గా ఉన్నారు. వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా ఏపీ పోలీసులు వాహనాన్ని వెంబడించిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: ప్రోటోకాల్ రగడ.. ఎంపీ వర్గీయులు ఆగ్రహం..! వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేశారని ఆరోపిస్తూ పోలీసులు ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసు దాడి జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. అరెస్ట్ అయిన వారిలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు. మూల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8మంది ఉన్నారు. నూజివీడు సబ్ జైలుకు 15 మంది నిందితులను తరలించారు. #vallabhaneni-vamsi #ap-news #gannavaram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి