Foods Not to Refrigerate: వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టకండి.. విషంగా మారి ప్రాణాలకే ముప్పు!

మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఖాళీగా ఉందని కిచెన్ ఐటెమ్స్ అన్నీ దాంట్లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీకు అలర్ట్. కిచెన్‌లో ఎప్పుడూ కనిపించే ఐదు రకాల ఫుడ్స్‌ను ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. అవేంటంటే..

New Update
Foods Not to Refrigerate: వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టకండి.. విషంగా మారి ప్రాణాలకే ముప్పు!

మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? ఖాళీగా ఉందని కిచెన్ ఐటెమ్స్ అన్నీ దాంట్లో నిల్వ చేస్తున్నారా..? అయితే మీకు అలర్ట్. కొన్ని రకాల ఆహారాలను ఫ్రిజ్లో స్టోర్ చేయకూడదు. ఎందుకంటే అవి కూలింగ్ టెంపరేచర్స్ వద్ద పాడైపోవచ్చు. వీటిని తింటే ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కిచెన్‌లో ఎప్పుడూ కనిపించే ఐదు రకాల ఫుడ్స్‌ ఐటెమ్స్‌ను ఫ్రిజ్‌లో అస్సలు నిల్వ చేయకూడదు. అవేంటంటే..

వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడితే, అది బ్యాక్టీరియా, బూజును త్వరగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఒలిచిన వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేయకూడదు. ఎందుకంటే ఇవి త్వరగా రియాక్షన్స్‌కు గురికావచ్చు. కొన్ని సెకన్లలోనే బూజు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వెల్లుల్లి చాలా తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. దీంతో దీని సహజ రుచి తగ్గిపోతుంది. అందుకే వీటి సహజ రుచి, ఆకృతిని కాపాడటానికి గది ఉష్ణోగ్రత వద్ద, వెలుతురు లేని చోట నిల్వ చేయడం మంచిది. వంటల్లో వాడటానికి ముందే పొట్టు తీయాలి, ముందే అన్నీ ఒలిచి పెట్టుకోకూడదు.

ఉల్లిపాయలు గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వీటిని రిఫ్రిజిరేటర్‌లో పెడితే తేమ కారణంగా త్వరగా పాడైపోవచ్చు, బూజు వ్యాపించి కుళ్లిపోవచ్చు. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడితే, వాటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారడం ప్రారంభిస్తుంది. దీంతో తేమ వాతావరణంలో వాటిపై బూజు ఏర్పడవచ్చు. ఒకవేళ సగం కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు మిగిలితే, వాటిని సీల్డ్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో రెండు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.

అల్లాన్ని మరీ తక్కువ ఉష్ణోగ్రతల వద్ద స్టోర్ చేస్తే, త్వరగా బూజు పట్టి కుళ్లిపోవచ్చు. వీటిని అలాగే ఉపయోగిస్తే కాలేయం, మూత్రపిండాల వైఫల్యానికి కారణం కావచ్చు. అందుకే దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడం మంచిది. అలా కాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉన్న అల్లాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెడితే, బ్యాక్టీరియాకు నిలయంగా మారి కొత్త సమస్యలు తీసుకొస్తుంది. వినియోగానికి పనికి రాకుండా తయారవుతుంది.

చాలామంది బ్రెడ్‌ను రిఫ్రిజిరేటర్‌లో పెడతారు. అయితే ఫ్రిజ్‌లోని చల్లని వాతావరణం కారణంగా, దీంట్లోని స్టార్చ్ తేమతో కలిసి బూజు ఏర్పడుతుంది. దీంతో చాలా వేగంగా ఎక్స్‌పైర్ అవుతుంది. బ్రెడ్ పాకెట్‌పై రాసిన ఎక్స్‌పైరీ డేట్ వరకు, దాన్ని రూమ్ టెంపరేచర్ వద్ద నిల్వచేసుకోవచ్చు, కానీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.చాలా మంది మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెడతారు. అయితే అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా విచ్ఛిన్నమై తేమ వాతావరణంలో బూజు పట్టడానికి కారణమవుతాయి. శీతల వాతావరణంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. అందుకే ఫ్రిజ్‌లో పెట్టిన అన్నం తింటే ఫుడ్ పాయిజనింగ్‌ కావచ్చు. అలాగే మిగిలిన అన్నాన్ని మళ్లీ వేడి చేస్తే, పోషక విలువలు కోల్పోతాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment