Kakinada: గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.... 20 మంది విద్యార్థులకు అస్వస్థత! ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండటమే ఈ ఫుడ్ పాయిజన్ కి కారణం అయి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Bhavana 27 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఏలేశ్వరం బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పాఠశాలలో ఆహార పదార్థాలు ఉండే వంటశాల అపరిశుభ్రంగా ఉండటమే ఈ ఫుడ్ పాయిజన్ కి కారణం అయి ఉంటుందని విద్యార్థినుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇదే గురుకుల పాఠశాలకు సంబంధించి వంటశాల అపరిశుభ్రం పై ఎన్నో వార్తలు పేపర్లలో వచ్చినప్పటికీ వాటిని తప్పుడు ప్రచారాలంటూ గురుకుల పాఠశాల సిబ్బంది చేతులు దులుపుకున్నారు. Also Read: కేరళ ఎక్స్ప్రెస్ కు తప్పిన పెద్ద ప్రమాదం…! #gurukula-school #eleswaram #food-poision #kakinada సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి