Somalia : కేఫ్‌ లో భారీ పేలుడు.. 20 మంది మృతి!

సోమాలియా రాజధాని మొగదిషులోని ఓ కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు.మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరో 2024 టోర్నీ ఫైనల్‌ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది.

New Update
Somalia : కేఫ్‌ లో భారీ పేలుడు.. 20 మంది మృతి!

Explosion In Cafe - Somalia : సోమాలియా (Somalia) రాజధాని మొగదిషులోని ఓ కేఫ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూరో 2024 (Euro 2024) టోర్నీ ఫైనల్‌ను కొందరు వీక్షిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. సోమాలీ పోలీసు ప్రతినిధి మేజర్ అబ్దిఫితా అడెన్ హస్సా మాట్లాడుతూ.. కొంతమంది కేఫ్ లోపల స్క్రీన్‌పై స్పెయిన్, ఇంగ్లండ్ (England) మధ్య జరిగిన యూరోపియన్ ఫుట్‌బాల్ ఫైనల్‌ (European Football Final) ను చూస్తుండగా పేలుడు పదార్థాలతో నిండిన కారుతో కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 20 మంది గాయపడ్డారని ఆయన వివరించారు.

పేలుడు సంభవించిన తరువాత కొందరు కేఫ్ ప్రహారీ గోడను దూకేందుకు ప్రయత్నించిన కొంతమంది గాయపడ్డారని, మరికొందరు తొక్కిసలాటలో గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.పేలుడు జరిగిన సమయంలో చాలా మంది బాధితులు రోడ్డుపైనే ఉన్నారని తెలిపారు. ఈ దాడికి బాధ్యులెవరో ఇంకా తెలియరాలేదు.

Also read: జువాలసిస్ట్ ఆడమ్‌కు 249 ఏళ్ల జైలు శిక్ష…ఎందుకో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

New Update
HP accident

HP accident

పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో పాండో ఆనకట్ట సమీపంలోని బఖ్లి రోడ్డుపై జరిగింది. మృతుల్లో ఎనిమిది నెలల చిన్నారి కూడా ఉన్నాడు.  

తమ్ముడి వివాహం అయిపోయాక 

మృతులను చాచియోట్ తహసీల్‌లోని తరౌర్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ కుమారుడు దునిచంద్ (33), తరౌర్ గ్రామానికి చెందిన దునిచంద్ భార్య కాంతా దేవి (28), వారి కుమార్తె కింజల్ (8 నెలలు), చాచియోట్ తహసీల్‌లోని నౌన్ గ్రామానికి చెందిన థాలియా రామ్ కుమారుడు దహ్లు రామ్ (52), నేపాల్ నివాసి మీనా దేవి (30)గా గుర్తించారు. దునిచాంద్ తమ్ముడి వివాహం అయిపోయిన తరువాత కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.  

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, పాండో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం, SDRF, CISF, పాండో అవుట్‌పోస్ట్ బృందాలు మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నాయి

Advertisment
Advertisment
Advertisment