Hydra Commissioner: హైడ్రా కమిషనర్ కు ముప్పు? భద్రత పెంపు!

హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన కట్టడాలు అవి బడాబాబులు.. సెలబ్రిటీలు ఎవరికి చెందినవైనా సరే కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు ముప్పు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, ఆయన ఇంటి వద్ద పోలీసు భద్రత పెంచింది.

New Update
BREAKING: హైడ్రా దూకుడు.. ఈరోజు కూల్చేది వాళ్లదే!

Hydra Commissioner: ఎవరైనా నిజాయితీగా ఉంటే పెనుముప్పు తప్పని రోజులివి. ఎవరైనా ఏదైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తేనే వారిపై దాడులకు తెగబడతారు. అలాంటిది ఏకంగా అక్రమార్కుల ఆక్రమణలను కూల్చివేస్తే.. ఎవరేమన్నా వెనక్కి తగ్గకుండా బుల్డోజర్ నడిపిస్తే.. కచ్చితంగా ఆ అధికారిపై అక్రమార్కులకు మంట పుడుతుంది. నయానో.. భయానో సదరు అధికారిని లొంగ తీసుకునే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇలాంటిది ఏదైనా హైడ్రా కమిషనర్ రంగనాధ్ విషయంలో జరగొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Hydra Commissioner:  హైదరాబాద్ లో చెరువులను ఎడా పెడా ఆక్రమించేసి.. ఆస్తులు.. అంతస్తులు కూడగట్టుకున్న బడాబాబులకు హైడ్రా కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. హైడ్రా పేరు వినపడితేనే అక్రమార్కులు ఉలిక్కి పడేలా పరిస్థితి ఉంది ఇప్పుడు. ఐపీఎస్ రంగనాధ్ నాయకత్వంలో హైడ్రా బుల్ డోజర్లు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రంగనాధ్ కు థ్రెట్ ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమార్కులను నిలువరిస్తూ వస్తున్న అధికారి రంగనాధ్ కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర పోలీసు భద్రతను భారీగా పెంచారు. ఇందుకోసం  మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. 

Hydra Commissioner:  ఇటీవలే సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీని తరువాత ప్రముఖ రాజకీయ నాయకుల కట్టడాలు హైడ్రా లిస్టులో ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తమ్మిడికుంట చెరువులోని  నాగార్జున ఎన్ కన్వెన్షన్ తో పాటు చుట్టు పక్కల ఉన్న పలు ఇతర కట్టడాలను కూడా అధికారులు కూల్చేశారు. మెటల్ చార్మినర్ లోపలివైపు ఉన్న స్క్రాప్ గోదాములు, వర్క్‌షాపులు, అలాగే నీటిని తోడి ట్యాంకర్లకు విక్రయించే షెడ్లు.. తదితర వాటిని కలిపి మొత్తం 20కి పైగా నిర్మాణాలను నేలమట్టం చేశారు. చెరువు వెనుక భాగాన భారీగా పేరుకుపోయిన జీవ వ్యర్థాల మూటలను చూసి అధికారులు షాకయ్యారు. గోశాల, క్రికెట్ నెట్లు, ఇతరత్రా నిర్మాణలు, అలాగే టీఎస్‌ఐఐసీ వైపు నుంచి చెరువులోకి చొచ్చుకొస్తున్న చెత్తకుప్పలు, నిర్మాణ వ్యర్థాల గుట్టల అంశంలో కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Also Read : 10, 20, 30 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి విలువ ఎంత అవుతుంది

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment