ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్.. మళ్లీ అధికారం మాదే: కేటీఆర్

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మళ్లీ అధికారం తమదేనని, హైట్రిక్ కొట్టబోతున్నట్లు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్. 2018లో ఈ సర్వేలన్నీ తప్పని తేలాయి. కాబట్టి డిసెంబర్ 3న తామే అధికారం చేపట్టబోతున్నామని తెలిపారు.

New Update
ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్.. మళ్లీ అధికారం మాదే: కేటీఆర్

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మళ్లీ అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతుందన్నారు. డిసెంబర్ 3న మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపడతారు. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఓ రబ్బిష్. 2018లో వచ్చిన సర్వేలన్నీ తప్పని తేలాయని గుర్తు చేశారు. ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ గతంలోనూ చూశామని, కాబట్టి కంగారుపడాల్సిన అవసరంలేదని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే ఇలాంటి సర్వేలు తమకు కొత్తేమీ కాదని, ఇది తప్పని తేలిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమకు డిసెంబర్ 3న క్షమాపణలు చెప్తారా? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఓ పక్క ఓటింగ్ జరుగుతుంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఏందన్నారు. బీఆర్ఎస్ 70 స్థానాలకు పైగా గెలిచి అధికారం చేపట్టబోతుందని చెప్పారు.

Also read: BREAKING: తెలంగాణలో ముగిసిన పోలింగ్

ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి ఓట్లు వేస్తూనే ఉన్నారని, అప్పుడే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడటమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండానే 200 మందిని అడిగినట్లు చేసి దాన్నే గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 మీడియా సంస్థలు సర్వేలు చేస్తే అందులో ఒక్కటే నిజమైంది అన్నారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఎవ్వరూ కన్ఫ్యూజన్‌ కావద్దని, వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ మా కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా గంట, గంటన్నర సేపు పోలింగ్‌ జరిగేది ఉందని.. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ఇంకా పోలింగ్‌ శాతం తేలలేదని.. ఫైనల్‌ పోలింగ్‌ ఎంత జరిగిందనేది రేపు ఉదయం తేలుతుందని తెలిపారు

Advertisment
Advertisment
తాజా కథనాలు