Jagan: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్

AP: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ నెల 8వ తేదీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. మూడు రోజులు పాటు పులివెందులలో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో జగన్ ఉండనున్నారు.

New Update
Jagan: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్

Jagan: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ నెల 8వ తేదీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. రేపు కడప విమాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయకు చేరుకుంటారు. మూడు రోజులు పాటు పులివెందులలో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో జగన్ ఉండనున్నారు.

బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం..

ఐదేళ్లలో వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి పథకాలను అందించామన్నారు జగన్. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయాలు నిలబడవన్నారు. తాము ప్రజల్లో వ్యతిరేకత కారణంగా ఓడిపోలేదన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా అధికారంలోకి వచ్చారన్నారు. రైతు భరోసా కింద ఇస్తామన్న రూ.20 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమ్మ ఒడి కింద ఇస్తామన్న రూ.15 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు రూ.1500 ఇస్తామని టీడీపీ చెప్పిందన్నారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

పాడెపై శవం ముందు కొందరు డ్యాన్సులు వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. కానీ ఆడ, మగ అంతా కలిసి శవం ముందు డీజే పాటలకు డ్యాన్సులు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

New Update
video viral.

video viral

సాధారంగా ఎవరైనా చనిపోతే బోరున ఏడుస్తారు. తమతో కలిసి జీవించే ఒక వ్యక్తి ఇకపై ఉండడని తెలిసి ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతారు. బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతారు. ఇంటి నుంచి స్మశానవాటికకు తీసుకెళ్లేంతవరకు ఏడ్చుకుంటూనే పాడెతో వెళ్తారు. 

Also Read :  ఆగని యుద్ధం.. 30 వేల మంది యువతను నియమించుకున్న హమాస్ !

శవం ముందు పెళ్లి డ్యాన్స్

కానీ ఇక్కడ ఓ ఘటన మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. చనిపోయిన ఓ వ్యక్తిని పాడె ఎక్కించి ఊరు ఊరంతా డ్యాన్సులతో హోరెత్తించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వీరేంట్రా ఇలా ఉన్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు. 

Also Read :  కేవలం రూ.300 వందలకే ఇంటింటికీ ఇంటర్నెట్.. రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త!

వీడియో బట్టి.. అది ఒక చిన్న గ్రామంలా కనిపిస్తుంది. ఒక వ్యక్తిని పాడెక్కించి ఆడ, మగ.. చిన్నా, పెద్దా ఇలా గ్రామస్తులంతా కలిసి డీజే పాటలు పెట్టి తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలో పాడెను ఆపి.. డీజే పాటలకు డ్యాన్సులు వేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఒక పక్క మహిళలు, మరో పక్క పురుషులు డ్యాన్సులు వేస్తున్నారు. వారి వెనుక పాడెపై మృతదేహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక డ్యాన్సులు చేస్తున్న వారంతా.. నవ్వుకుంటూ.. చాలా సరదాగా.. సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: మావోయిస్టు అగ్రనేత హతం.. వివేక్‌ను మట్టుబెట్టిన భధ్రతాబలగాలు!

viral-video | viral-news | latest-telugu-news | telugu-news

Also Read: కర్ణాటక డీజీపీ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి హత్యకు సహకరించిన కూతురు?

Advertisment
Advertisment
Advertisment