ED Rides: హైదరాబాద్, ఒంగోలులో ఈడీ దాడులు హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదలవాడ ఇంఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీపై 8ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ SBI బ్యాంకు నుంచి రూ.166.93 కోట్ల నగదును చదలవాడ ఇంఫ్రాటెక్ కంపెనీ దారి మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. By V.J Reddy 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ED Rides: హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదలవాడ ఇంఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీపై 8ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ SBI బ్యాంకును చదలవాడ ఇంఫ్రాటెక్ కంపెనీ మోసం చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు నుంచి పొందిన నగదును దారి మళ్లించినట్లు గుర్తించారు. ఆ కంపెనీ డైరెక్టర్ చదలవాడ రవీంద్రబాబు సహా ఇతరులపై ఏసీబీ, సీబీఐ కేసులు నమోదు అయ్యాయి. ఏసీబీ, సీబీఐ కేసు FIR ఆధారంగా ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిధులు నేరపూర్తిత కుట్రలో రూ.166.93 కోట్లు మేర మోసం చేసినట్లు గుర్తించారు. బ్యాంకు ఇచ్చిన నిధులతో డైరెక్టర్లు ఇతరులతో కలిసి కుట్ర చేసినట్లు ఈడీ పేర్కొంది. బ్యాంకు రుణాల నిధులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. #ed-raids సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి