Astrology: మంచం మీద కూర్చొని భోజనం ఎందుకు తినకూడదు..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..?

మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం శుభప్రదం కాదు. ఇలా చేయడం జీవితంలో అనేక ఇబ్బందులు, ఆర్ధిక సంక్షోభానికి కారణమవుతుందని నమ్ముతారు. అసలు వాస్తు ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం శుభమా, అశుభమా తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Astrology: మంచం మీద కూర్చొని భోజనం ఎందుకు తినకూడదు..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..?

Astrology:  వాస్తు శాస్త్రం ప్రకారం, మన దినచర్యలో ఇలాంటి అనేక అలవాట్లు ప్రస్తావించబడ్డాయి, ఇవి ఒక వ్యక్తి జీవితంలో ప్రతికూలతను కలిగిస్తాయి. అంతే కాదు, ఈ తప్పుడు అలవాట్లు వాస్తు దోషాలను కూడా దారి తీస్తాయని చెబుతారు. ఈ అలవాట్లలో ఒకటి మంచం మీద కూర్చొని భోజనం చేయడం. దీని కారణంగా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు వాస్తు ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తినడం శుభమా? అశుభమా? తెలుసుకుందాం...

మంచం మీద తినడం వల్ల కలిగే నష్టాలు

  • వాస్తు ప్రకారం మంచం మీద కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల ఇంటికి దారిద్య్రం అని విశ్వాసం. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మంచంపై కూర్చొని భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు.
  • మంచం పై భోజనం చేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపించి వాస్తు దోషాలు ఏర్పడతాయని నమ్మకం. అంతే కాదు దీని వల్ల రాహువు అశుభ ఫలితాలు ఇస్తాడని, ఇంట్లో అశాంతి నెలకొంటుందని కూడా చెబుతారు.
  • మంచం పై కూర్చొని భోజనం చేయడం తల్లి అన్నపూర్ణ దేవికి కోపాన్ని కలిగిస్తుంది. అందుకే మంచం మీద కూర్చొని ఆహారం తినకూడదని చెబుతారు.

ఆహారానికి సంబంధించిన వాస్తు చిట్కాలు

  • రాత్రి భోజనం చేసిన తర్వాత మురికిగా ఉన్న పాత్రలను వెంటనే శుభ్రం చేయాలి. వంటగదిని మురికిగా ఉంచడం తల్లి అన్న పూర్ణ ఆగ్రహానికి కారమవుతుందని నమ్ముతారు.
  • వాస్తు ప్రకారం ఎప్పుడూ హాయిగా నేలపై కూర్చొని భోజనం చేయాలి. లేదంటే డైనింగ్ టేబుల్ పై కూర్చొని కూడా తినవచ్చు. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోవాలి.

Also Read: World Liver Day: నేడు ‘ప్రపంచ కాలేయ దినోత్సవం’.. ఆరోగ్యకరమైన కాలేయం కోసం ఈ చిట్కాలు పాటించండి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

New Update
Rains

Rains

ఉపరితల ఆవర్తనం వల్ల మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీ వరకు గాలులు ఉండవచ్చని తెలిపింది.

ఇది కూడా చూడండి:  AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహూబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఇదిలా ఉండగా.. ఏపీలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాలులు కూడా తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment