West Indies : టీ 20 వరల్డ్ కప్.. ఆఫ్గనిస్థాన్ కోచ్ గా విండీస్ మాజీ క్రికెటర్!

టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గనిస్తాన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇయర్ జరగబోతున్న టీ 20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో ను బౌలింగ్ క‌న్స‌ల్టెంట్‌గా నియ‌మించింది. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ బోర్డు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించింది.

New Update
West Indies : టీ 20 వరల్డ్ కప్.. ఆఫ్గనిస్థాన్  కోచ్ గా విండీస్ మాజీ క్రికెటర్!

T20 World Cup 2024 : టీ 20 ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ మెగా టోర్నీకి అతికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వరల్డ్ కప్ లో గతంలో ఊహించని సంచలనాలు సృష్టించిన ఆఫ్గనిస్థాన్(Afghanistan) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇయర్ జరగబోతున్న టీ 20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో ను బౌలింగ్ క‌న్స‌ల్టెంట్‌గా నియ‌మించింది.

ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ బోర్డు ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించింది. స్లో పిచ్ లు ఉండే విండీస్ గడ్డపై తమ బౌలింగ్ టీమ్ కి బ్రావో ఎంతో హెల్ప్ అవుతాడని ఆఫ్ఘాన్ బోర్డు గట్టిగానే విశ్వసిస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ (International Cricket) లో టాప్ ప్లేయర్ గా రాణించిన బ్రావో విండీస్ గెలిచిన టీ 20 వరల్డ్ కప్ లో ఓ సభ్యుడు కావడం విశేషం.

Also Read : ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడటం వాళ్ళ చేతుల్లోనే ఉంది : అంబటి రాయుడు

టీ 20 ల్లో అత్యధిక వికెట్స్ తో హిస్టరీ క్రియేట్ చేసిన బ్రావోకి ఐపీఎల్ కోచ్ గా సేవలందించిన అనుభవం కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ యూనిట్ కి కోచ్ గా ఉన్న బ్రావో.. త్వరలోనే అఫ్గ‌నిస్థాన్ టీమ్ తో జాయిన్ కానున్నాడు. కాగా ఇప్ప‌టికే కాబూలీ బృందం విండీస్ చేరుకుంది.

అక్క‌డి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో కోచింగ్ సిబ్బంది ఆధ్వ‌ర్యంలో 10 రోజులు శిక్ష‌ణ శిబిరంలో పాల్గొనుంది. ఇక అప్ఘ‌నిస్థాన్ బౌలింగ్ అసిస్టెంట్‌గా ఎంపికైన బ్రావో వ‌ర‌ల్డ్ క‌ప్ పరీక్ష‌లో నెగ్గుతాడా? లేదా? అనేది త్వరలోనే తేలిపోతుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.

New Update
ap cabinet

ap cabinet Photograph: (ap cabinet)

అమెరికాల టారిఫ్ ల భారం ప్రభావం ఏపీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే మత్స్య ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులకు చాలా గట్టిగా తగిలింది. దీంతో తాము చాలా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిషయం గురించి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు, హేచరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమని, ఆక్వా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు సూచించారు. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని కోరారు. ఆక్వా రంగం సమస్యల పరిష్కారం కోసం 11 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

సుంకాల భారం నుంచి బయటపడటానికి, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు.. మొత్తం 11 మంది ఉంటారు. రైతుల నుంచి కె.రఘు, కుమారరాజు, రామరాజు (ఏపీఐఐసీ ఛైర్మన్‌), శ్రీకాంత్‌.. ఎగుమతిదారుల నుంచి కె.ఆనంద్, ఆనంద్‌కుమార్, ఎన్‌.వెంకట్, డి.దిలీప్‌.. హేచరీల ప్రతినిధులుగా పీవీబీ కుమార్, ఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి, ఫీడ్‌ మిల్లుల తరఫున సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉంటారు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించి రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి చంద్రబాబు సూచించారు.

ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మళ్లీ సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులున్నారని.. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఇది ఊహించని సమస్య అని.. ఈ సమస్య పై రైతులు ఓపికగా ఉండాలన్నారు.

ఆక్వా ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాల భారాన్ని రైతుల పైకి నెట్టకుండా వ్యాపారులు, ఫీడ్‌మిల్లులు, హేచరీలు బాధ్యత తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రొయ్యకు స్థానిక వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పరిస్థితి చక్కబడే వరకు రైతుకు ధైర్యం కల్పించాలని.. రైతుకు గిట్టుబాటు రేటు ఇచ్చేలా వ్యాపారులు చూడాలి అన్నారు. కొంతమంది రైతులు క్రాప్ హాలిడే అని ప్రకటించడంతో.. ఈ అంశంపైనా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చించనుంది.

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

cbn | trump | tarriffs | trump tariffs | trump tariffs india | trump tariffs news | trump tariff war | donald trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment