Ongole: SI వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య..! ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండాయపాలెంలో పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. గుడ్లూరు SI వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సురేష్ ( మృతుడు) సూసైట్ నోట్ రాశారు. దీంతో, మృతుని కుటుంబసభ్యులు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 16 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Ongole: ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వేధింపులతో ఓ వ్యక్తి బలవన్మరణం చెందినట్లు తెలుస్తోంది. మృతుడు సురేష్ తెట్టు వద్దగల వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్ట్ సెక్యూరిటీ గా పనిచేస్తున్నాడు. గుడ్లూరు SI వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సురేష్ రాసిన సూసైట్ నోట్ వెలుగులోకి వచ్చింది. Also Read: కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం..! దీంతో, పోలీసుల తీరుపై కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పోలీసులను గ్రామంలోకి రాకుండా కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మృతునికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్ మృతిపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. #ongole-news సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి