Waynad Land slides: వయనాడ్‌ లో మృత్యుంజయుల కోసం రంగంలోకి డ్రోన్‌ రాడార్లు!

వయనాడ్‌ లో కొండచరియలు సృష్టించిన విషాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిల్చిన విషయం తెలిసిందే.సుమారు 320 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు.మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్‌ ఆధారిత రాడార్‌ ను ఉపయోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

New Update
Wayanad : వయనాడ్‌ ఇన్సిడెంట్‌ తరువాత కేంద్రం అలర్ట్..ఆ 6 రాష్ట్రాలకు...!

Waynad Landslides: వయనాడ్‌ లో కొండచరియలు సృష్టించిన విషాదం ఎన్నో కుటుంబాల్లో అంతులేని ఆవేదన మిగిల్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు 320 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇంకా 300 మందికి పైగా ప్రజల ఆచూకీ లభించాల్సి ఉంది. కూలిపోయిన భవనాలు, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన వారి కోసం సహాయక చర్యలను వేగవంతం చేశారు.

మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్‌ ఆధారిత రాడార్‌ ను ఉపయోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. భారత సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్‌ఎఫ్‌,తీర రక్షక దళం, ప్రభావిత ప్రాంతాల్లో కలిసికట్టుగా గాలింపు చర్యల్లో పాల్గొననున్నాయి. ఈ బృందాల్లో ముగ్గురు స్థానికులు, ఓ అటవీ శాఖ ఉద్యోగి భాగం కానున్నారు. విపత్తు సంభవించిన ప్రాంతాన్ని ఆరు జోన్లుగా విభజించి 40 బృందాలు గాలింపు చర్యలు చేపట్టనున్నాయి.

Also read: హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్దం…రద్దైన ఎయిర్‌ ఇండియా విమానం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మూలిక వరం

రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిన్నప్పుడు మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ముస్లి మూలిక బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

New Update

Diabetes: ఇటీవలి కాలంలో చాలా మంది బాధపడుతున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఒక వ్యక్తికి డయాబెటిస్ వచ్చిన తర్వాత జీవితాంతం మందులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆహారం, పానీయాల వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో తెల్ల ముస్లి మూలిక బాగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ముస్లి మూలిక బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

జీర్ణ సమస్యలు ఉపశమనం:

తెల్ల ముస్లి అనేది ఆయుర్వేదంలో ఒక మూలికగా పరిగణించబడే అడవి మొక్క. దీనిని తరచుగా తెల్ల బంగారం లేదా దైవిక ఔషధం అని పిలుస్తారు. తెల్ల ముస్లిని శాస్త్రీయంగా క్లోరోఫైటమ్ బోరివిలియనం అని పిలుస్తారు. ఇది ఆయుర్వేదంలో శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఇది స్త్రీ, పురుషులలో లైంగిక శక్తిని, శారీరక బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. దీనికి గుండె సంబంధిత వ్యాధులను నయం చేసే శక్తి కూడా ఉంది. తెల్ల ముస్లీలో ఉండే లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ రోగులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కడుపు నొప్పి, విరేచనాలు, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

మహిళల్లో తల్లి పాలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది పురుషులు,  స్త్రీలలో మూత్ర సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. తెల్ల ముస్లీని ఆయుర్వేదం, యునాని, హోమియోపతిలో ఉపయోగిస్తారు. దీన్ని తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని చాలా మంది వైద్య నిపుణులు అంటున్నారు. క్యాన్సర్ కణాల పెరుగుదల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  ఈ మొక్క జాతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతోంది. వైద్యులు, నిపుణుల సలహా మేరకు మాత్రమే తెల్ల ముస్లీని తినాలి. ఈ ఔషధం కొంతమందిలో అలెర్జీలకు కారణం కావచ్చు. దాని వినియోగాన్ని ప్రారంభించే ముందు నిపుణుడిని సంప్రదించాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment