డ్రైవర్లు లేని కార్లు ఎప్పటికీ రావు..నితిన్ గడ్కరీ!

భారత్ లో డ్రైవర్స్ లేని కార్లు రావటం ఎప్పటకీ జరగదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.అదే జరిగితే డ్రైవర్‌ల భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.టెస్లా ఎలక్ట్రికల్ కార్లను భారత్ లో అనుమతిస్తున్నప్పటికీ చైనాలో తయారీ సరైనది కాదని ఆయన అన్నారు.

New Update
డ్రైవర్లు లేని కార్లు ఎప్పటికీ రావు..నితిన్ గడ్కరీ!

IIM నాగ్‌పూర్ లో నిర్వహిస్తున్న జీరో మైల్ సంవాద్ కార్యక్రమంలో  రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను చేర్చడం, ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టం ద్వారా జరిమానాలను పెంచడం లాంటి విషయాలను తెలిపారు.

మేము ఎలక్ట్రిక్ మోటార్స్ చట్టం ద్వారా జరిమానాలను పెంచాము.వాటిపై ప్రజల్లో అవగాహన కూడా పెంచుతామని నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే, భారత్ లో డ్రైవర్స్ లేని కార్లు రావటం ఎప్పటకీ జరగదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.అదే జరిగితే డ్రైవర్‌ల భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్ లో టెస్లాను స్వాగతిస్తున్నప్పటికీ, విక్రయాల కోసం చైనాలో తయారీ విధానం సరైనది కాదని కూడా ఆయన పేర్కొన్నాడు.అలా చేస్తే భారత్ లో విక్రయాలు జరగవని గడ్కరీ వెల్లడించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

New Update
AP Cabinet Meeting

AP Cabinet Meeting

AP Cabinet Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Also Read: VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

 

Advertisment
Advertisment
Advertisment