Maha Shivratri 2024: శివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా? దీక్ష సమయంలో ఈ పానీయాలు తాగవచ్చా?

New Update
Maha Shivratri 2024: శివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా? దీక్ష సమయంలో ఈ పానీయాలు తాగవచ్చా?

Maha Shivratri 2024: ప్రతీ సంవత్సరం ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం నాల్గో రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. ఇవాళే మహాశివరాత్రి. మత విశ్వాసల ప్రకారం శివుడితో పార్వతికి వివాహం ఆ రోజే జరిగింది. అందుకే ఆ రోజున శివ కల్యాణాన్ని ఆలయాల్లో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పవిత్ర రోజున భక్తులు దేవాలయాలలో పూజలు చేస్తారు. ఉపవాసం పాటిస్తారు. శివుడితో పాటు పార్వతీ దేవిని పూజిస్తారు. శివరాత్రి నాడు కొందరు కఠోర ఉపవాస దీక్ష చేస్తారు.. మరికొందరు పండ్లు తినడం ద్వారా ఉపవాసం ఉంటారు. మీరు కూడా అలాంటి వ్యక్తులలో ఒకరు అయితే ఈ ఆర్టికల్‌ మీ కోసమే. ఉపవాసానికి సరైన ఎంపిక అయిన కొన్ని పానీయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం. ఈ పానీయాలు తాగడం వల్ల మీ కడుపు నిండుగా ఉండటమే కాకుండా రోజంతా మీ శరీరంలో శక్తి ఉంటుంది.

బొప్పాయి:

  • బొప్పాయిలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. అవి శరీరాన్ని ఎక్కువ సేపు శక్తివంతంగా ఉంచుతాయి. బొప్పాయి జ్యూస్‌ శరీరాన్ని చాలా హైడ్రేట్‌గా ఉంచుతుంది. మీరు బొప్పాయి జ్యూస్‌ని మహాశివరాత్రి ఉపవాసం సమయంలో తాగవచ్చు.

జామ:

  • ఉపవాసం సమయంలో జామ పండుతో చేసిన సిరప్ తాగవచ్చు. రోజంతా మీ శరీరంలో శక్తి చెక్కుచెదరకుండా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులువే.

స్ట్రాబెర్రీ:

  • మీ ఇంటి చుట్టుపక్కల స్ట్రాబెర్రీలు సులభంగా దొరికితే ఉపవాసం రోజున మీరు స్ట్రాబెర్రీ షేక్‌ని తయారు చేయవచ్చు. ఇది తాగితే చాలా సేపు డీహైడ్రేట్ కాకుండా ఉంటాం.
  • వీటితో పాటు సాధారణ మిల్క్ షేక్స్ కూడా తాగవచ్చు. ఇవి తాగితే కడుపు నిండుగా ఉంటుంది. దీనితో పాటు మీ శరీరంలో శక్తి కూడా చెక్కుచెదరకుండా ఉంటుంది. ఉపవాసం చేయాలి కానీ మన ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టి కాదు.. అందుకే పండ్ల రసాలతో కడుపును నింపుకోని దేవుడిని ప్రార్థించవచ్చు. ఉపవాసం ఎఫెక్ట్‌ అన్నది ఒక మనిషికి ఇంకో మనిషికి ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకోవాలి.

ఇది కూడా చదవండి: శివరాత్రి రోజు పొరపాటున కూడా ఈ విషయాలను విస్మరించకండి..ఈ రోజున ఏం చేయాలి..ఏం చేయకూడదంటే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

PBK VS RR: పంజాబ్ కింగ్స్ ను బోల్తా కొట్టించిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2025లో ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ఆర్ ఇచ్చిన టార్గెట్ ను ఛేజ్ చేయలేక పంజాబ్ బోల్తా పడింది. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

PBK VS RR

పంజాబ్ కింగ్స్ కు షాక్ ఇచ్చింది రాజస్థాన్ రాయల్స్. సంజూ శాంసన్ కెప్టెన్సీలో విజయాన్ని నమోదు చేసుకుంది. పంజాబ్ కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఈ టార్గెట్ ను ఛేదించలేక కింగ్స్ బొక్క బోర్లా పడ్డారు. 155 పరుగులకే ఆలౌట్ అయిపోయి 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. పంజాబ్ బ్యాటర్ నేహాల్ వధేరా 62 పరుగులతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇతని తర్వాత మాక్స్ వెల్ ఒక్కడే 30 పరుగులు చేసాడు. నేహాల్ , మ్యాక్స్ వెల్ చాలా సేపు క్రీజులో ఉండి జట్టు విజయానికి పాటు పడ్డారు. కానీ మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం డబుల్ డిజిట్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ ను చేజార్చుకోవాల్సి వచ్చింది.  కింగ్స్ బ్యాటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచే వికెట్లను పోగొట్టుకుంటూ వచ్చింది. 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, అంతకు ముందు మ్యాచ్ లో బాగా ఆడిన ప్రభ్ మన్ సింగ్ ఎవరూ కూడా ఎక్కువసేపు ఉండలేదు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3, సందీప్‌ శర్మ 2, మహీశ్ తీక్షణ 2, కార్తికేయ,  హసరంగ చెరో వికెట్‌ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్..

చంఢీఘడ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 67తో స్కోర్‌తో అదరగొట్టాడు. చివర్లో రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లతో 43 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ కూడా 38 పరుగులతో రాణించాడు. నితీశ్ రాణా 12, హెట్ మయర్ 20, ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఫెర్గూసన్ 2, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌ తలొ వికెట్ తీశాడు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | match | cricket

Also Read: RC 16: రామ్ చరణ్ రోరింగ్ టుమారో..పెద్ది గ్లింప్స్ రిలీజ్

 

Advertisment
Advertisment
Advertisment