BRAOU Admissions: అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు!

డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికిగానూ డిగ్రీ, పీజీ, పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఆగస్టు 18 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. https://www.braouonline.in/

New Update
BRAOU Admissions: అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులకు దరఖాస్తులు!

Hyderabad: హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించినోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ/ ఎంకాం/ఎమ్మెస్సీ) పలు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలు చేపట్టనున్నట్లు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.

2024 ఆగస్టు 18 వరకూ దరఖాస్తులు..
ఈ మేరకు ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఆగస్టు 18 వరకూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అలాగే యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ రెండు, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలని కోరింది. డిగ్రీ, పీజీలో 2015-16 నుంచి 2023-24 వరకు అడ్మిషన్ పొంది ఫీజు సకాలంలో చెల్లించనివారు ఆగస్టు 18వ తేదీలోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని తెలిపింది. మరిన్ని వివరాలకోసం వర్సిటీ సహాయక కేంద్ర నంబర్లు 7382929570/580, 040-23680290/291/294/295, 55, 18005990101లను సంప్రదించాలని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్‌ ఎల్‌వీకే రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్ సైట్ www.braouonline.in, www.braou.ac.in

ఇది కూడా చదవండి: Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన!


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు బిగ్ అలర్ట్.. బదిలీల షెడ్యూల్ ఖరారు!

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురాగా మే 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను భర్తీ చేయనుంది. 

New Update
DSC Posts

AP government key decision on government teachers transfers

Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలపై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మే 30 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.  ఏప్రిల్ 20 నాటికి సీనియారిటీ జాబితా పూర్తిచేసి మెగా డీఎస్సీతో ఖాళీలను  భర్తీ చేసేందుకు సిద్ధమైంది. 

GO-117 రద్దు..

ఈ మేరకు ఈ చట్టం ప్రకారం మొదటిసారి బదిలీలు చేయనుండగా GO-117ను రద్దు చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి తీసుకురాబోతున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానంలో అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయనున్నారు. 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉండగా.. 1-5 తరగతులకు 5గురు టీచర్లను  కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే 95% పూర్తి చేయగా.. 430 బడులకు సంబంధించి ఫనల్ చేయాల్సివుంది.  వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసి మే 30 వరకు బదిలీల అంశాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. అలాగే సీనియారిటీ టీచర్ల జాబితాను ఏప్రిల్ 20వరకు సే పూర్తి చేయనున్నారు. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఇక బదీలల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నారు. ఖాళీల ఆధారంగా ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక టీచర్‌ ఎన్ని ఆప్షన్స్ అయినా ఎంచుకోవచ్చు.  సీనియారిటీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం పోస్టులు కేటాయించనున్నారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలలో మళ్లీ పనిచేసే అవకాశం ఉండదు. 2 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకున్నవారు నచ్చిన పాఠశాలను ఎంచుకోవచ్చు. మొదట ప్రధానోపాధ్యాయుల బదిలీలు ఉంటాయి. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులుంటాయి. స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించనున్నారు. చివరిగా SGTలకు బదిలీలు నిర్వహిస్తారు.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

 transfer | cm-chandrababu | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment