Double Ismart : వివాదంలో చిక్కుకున్న'డబుల్ ఇస్మార్ట్' సాంగ్.. పూరీ జగన్నాథ్ పై కేసీఆర్ ఫ్యాన్స్ ఫైర్! ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ నుంచి తాజాగా మార్ ముంత చోడ్ చింత అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో కేసీఆర్ 'ఇప్పుడేం చేద్దాం అంటావ్ మరి' అనే డైలాగ్ ను వాడారు. దీనిపై కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా KCR వాయిస్ వాడారని ఆరోపిస్తున్నారు. By Anil Kumar 17 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Double Ismart Song In Controversy : ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. పక్కా మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. 'మార్ ముంత చోడ్ చింత' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ లో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన 'ఇప్పుడేం చేద్దాం అంటావ్ మరి' అనే డైలాగ్ ను వాడారు. ఇప్పుడు ఇది కాస్త వివాదంగా మారింది. సాంగ్ లో కేసీఆర్ వాయిస్ ను ఉపయోగించడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగానే డైరెక్టర్ పూరి జగన్నాథ్పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు..ఈ పాటలో 'కల్లు కంపౌండ్' దగ్గర హీరో, హీరోయిన్ కల్లు బాటిళ్లు పట్టుకొని చిందేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊతపదం 'ఏం జేద్దామంటవ్ మరీ..' పదాల్ని ఆయన వాయిస్ తోనే ఉపయోగించారు. Also Read : ‘జాతి రత్నాలు’ హీరోకు ప్రమాదం.. చేతికి గాయం, స్వయంగా బయటపెట్టిన నవీన్ పోలిశెట్టి! అది కూడా పాటలో రెండుసార్లు వినిపిస్తుంది. దీంతో కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. కేసీఆర్ అంటే తాగుడు.. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా పాట మధ్యలో ఆయన వాయిస్ ఉపయోగించారంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పూరీ జగన్నాథ్ తో పాటూ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ పై మండిపడుతున్నారు. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. #double-ismart #maar-muntha-chod-chinta-song సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి