Pregnant Women: గర్భిణుల కోరికలను కాదనకూడదట..ఎందుకో తెలుసా?

గర్భంతో ఉన్న సమయంలో తల్లిలో చాలా మార్పులు వస్తాయి. కడుపులో బిడ్డ పెరగడంతో, బిడ్డ కదలికలను బట్టి తల్లికి కూడా ఏం తినాలో కోరికలు పుడతాయి. అందుకే తల్లి ఏం అడిగినా వెంటనే తెచ్చిపెడితే కడుపులో ఉన్న శిశువు కూడా సంతోష పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

New Update
Pregnant Women: గర్భిణుల కోరికలను కాదనకూడదట..ఎందుకో తెలుసా?

Pregnant Women: మహిళ గ‌ర్భం దాల్చిందని తెలియగానే ఇంట్లో వాళ్లంతా ఎంతో సంతోషిస్తారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కాలు కిందపెట్టకుండా సపర్యలు చేస్తుంటారు. కోరిందల్లా తెచ్చి ముందు పెడుతుంటారు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ తల్లితో పాటు కడుపులో బిడ్డను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో పాటు చుట్టూ ఉన్నవారు కూడా ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.

publive-image

డెలివరీ అయ్యే వరకు అలాగే కాపాడుతారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరిగేందుకు నిత్యం పోషకాలు ఉన్న ఆహారాలు అందిస్తారు. కడుపులో ఉన్న సమయంలో మహిళలకు సాధారణంగా అనేక పదార్థాలు తినబుద్ది అవుతుంటుంది. అందుకే ఏం అడిగినా కుటుంబ సభ్యులు కాదనరు. గర్భంతో ఉన్న సమయంలో తల్లిలో చాలా మార్పులు వస్తాయి. అందుకే ఏమి అడిగినా కాదనకూడదని పెద్దలు అంటుంటారు.

publive-image

గ‌ర్భం దాల్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మహిళలకు చాలా ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంటుంది. పుల్లటివి ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే వారి కడుపులో బిడ్డ పెరగడంతో తల్లిలో ఇలాంటి మార్పులు సహజం అని వైద్యులు అంటున్నారు. బిడ్డకు అందే పోషకాలు కూడా తల్లి తినేదాన్ని బట్టి ఉంటుందని, బిడ్డ కదలికలను బట్టి తల్లికి కూడా ఏం తినాలో కోరికలు పుడతాయని అంటున్నారు. అందుకే తల్లి ఏం అడిగినా వెంటనే తెచ్చిపెడితే కడుపులో ఉన్న శిశువు కూడా సంతోష పడుతుందని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: కుక్క కోసం వెతుకుతున్న ఓనర్‌కు కెమెరాలో కనిపించిన షాకింగ్‌ ఘటన

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment