Warangal MGM : నాలుగు రోజుల పసిగుడ్డును పీక్కుతిన్న కుక్కలు.. వరంగల్ లో దారుణం! వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసిగుడ్డును కుక్కలు పీక్కుతిన్నాయి. జనం రద్దీగా తిరిగే ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డు ముందే ఈ ఘటన జరగడం దారుణం. అయితే కుక్కలు ఆ చిన్నారి మృతదేహన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయి అనేది మాత్రం తెలియరాలేదు By Bhavana 10 Aug 2024 in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి Dogs Attack On 4 Days Baby : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి (Warangal MGM Hospital) లో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసిగుడ్డును కుక్కలు (Dogs Attack) పీక్కుతిన్నాయి. జనం రద్దీగా తిరిగే ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డు ముందే ఈ ఘటన జరగడం దారుణం. అయితే కుక్కలు ఆ చిన్నారి మృతదేహన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయి అనేది మాత్రం తెలియరాలేదు. పోలీసులు ఆసుపత్రి అధికారులు ఈ దారుణ ఘటన గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఆ పసికందు ఆడనా, మగనా? అనేది తెలియాల్సి ఉంది. సగం బాడీని కుక్కలు తినేయడంతో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. పసికందు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వారి చిన్నారి కాకపోవచ్చునని భావిస్తున్నారు. డెడ్ బాడీని తీసుకువచ్చి ఎంజీఎం పరిసరాల్లో వదిలివేసినట్లు అనుమానిస్తున్నారు. Also read: మెడికల్ విద్యార్థిని దారుణ హత్య…! #street-dogs-attack-on-child #mgm-hospiatal #warangal సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి