BSNL ఇస్తున్న ఈ బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తెలుసా?

మీరు జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు జియో ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ గురించి వినే ఉంటారు. కానీ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సేవ గురించి మీకు తెలుసా? ఎయిర్‌టెల్, జియో లాగానే బీఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారులకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది.

New Update
BSNL ఇస్తున్న ఈ బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు తెలుసా?

భారత్ ఫైబర్ పైబర్ పేరుతో BSNL తన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ద్వారా వినియోగదారులకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడమే కాకుండా అనేక చవకైన, గొప్ప ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఐపీఎల్ సమయంలో మ్యాచ్‌లు చూడటానికి అలాంటి ప్లాన్లు చాలా ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

ఈ జాబితాలో మొదటి ప్లాన్ రూ. 599. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఒక నెల వ్యాలిడిటీని పొందుతారు. 60 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. అయితే ఇది పూర్తిగా అన్‌లిమిటెడ్ కాదు. కంపెనీ ఈ ప్లాన్‌లో తన వినియోగదారుల కోసం ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) పరిమితిని 3300 జీబీకి సెట్ చేసింది. అంటే నెల మొత్తం మీద 3300 జీబీ ఇంటర్నెట్ డేటాను 60 ఎంబీపీఎస్ వేగంతో పొందుతారు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 60 ఎంబీపీఎస్ నుంచి 4 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రెండో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 699. ఈ ప్లాన్‌లో కూడా వినియోగదారులు ఒక నెల చెల్లుబాటుతో 60 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ సేవను పొందుతారు. ఈ ప్లాన్‌లో కూడా కంపెనీ తన వినియోగదారుల కోసం 3300 జీబీ ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) లిమిట్‌ను సెట్ చేసింది. మీరు ఒక నెలలో అంత కంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తే ఇంటర్నెట్ వేగం 60 ఎంబీపీఎస్ నుంచి 4 ఎంబీపీఎస్‌కి తగ్గుతుంది. అయితే ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు సంబంధించిన ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా బీఎస్ఎన్ఎల్ ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మీ సర్కిల్‌లోని బీఎస్ఎన్ఎల్ లిస్టింగ్‌ను చెక్ చేయడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

జియో ఫైబర్ అందిస్తున్న చవకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ. 399తో వస్తుంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ఒక నెల పాటు 30 ఎంబీపీఎస్ వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్‌తో ఏ ఓటీటీ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ లభించబోదు.ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న చవకైన ప్లాన్ రూ. 499. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ఒక నెల పాటు 40 ఎంబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌తో కూడా ఏ ఓటీటీ యాప్ సబ్‌స్క్రిప్షన్ అందించలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment