TTD: తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తుల విజ్ఞప్తి..ఈవో ఏమన్నారంటే.!

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు. స్పందించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి..ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదన్నారు. అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

New Update
TTD: తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తుల విజ్ఞప్తి..ఈవో ఏమన్నారంటే.!

TTD: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించే అవకాశమే లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. లడ్డూ బరువు, పరిమాణం ఏ మాత్రం తగ్గలేదన్న ఈవో.. రేటు తగ్గించేందుకు అవకాశం లేదన్నారు. తిరుమల అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ఈవో కార్యక్రమంలో భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానం ఇచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒకటి ఫ్రీగా లడ్డూ అందిస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో తప్ప, మిగిలిన సమయంలో భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు పొందే సదుపాయం కల్పించామన్నారు. యువకులు శ్రీవారి సేవకులు, క్యూలైన్లు, శ్రీవారి ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని ఈవో పిలుపునిచ్చారు.

తిరుమలలో భక్తులకు సేవలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న 65ఏండ్ల పరిమితిని 60ఏండ్లకు కుదించాలని చేసిన సూచనను తిరస్కరించారు. 60ఏండ్లవారుకూడా సక్రమంగా సేవలందిస్తారని పేర్కొన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దర్శనం, సేవా టికెట్లు పొందిన భక్తులకు వసతి అందుబాటులోకి వస్తుందని ఈవో తెలిపారు. 50ఏండ్ల క్రితం నిర్మించిన సప్తగిరి విశ్రాంతి భవనాలను ఆధునీకరిస్తామని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: మళ్లీ వారణాసి నుంచే బరిలోకి ప్రధాని మోదీ..195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల.

అటు టీటీడీ పాలకమండలి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. అటవీ కార్మికుల జీతాలు కూడా పెంచుతామన్నారు. అలాగే వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు 8.16 కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు.

రూ. 3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్ లు ప్రింటింగ్ చేయనుంది. స్విమ్స్ లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు ఏర్పాటు చేస్తానన్నారు. టీటీడీలోని అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రాయితీ పై భోజన సదుపాయం..రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. అన్నదానంలో రూ.3 కోట్లతో వస్తువులు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. సూపెర్వైజర్ పోస్టులతో పాటు క్రింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం చేయనుంది. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోక్కాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని అనుకుంటుంది. తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment