Pawan Kalyan : పిఠాపురంలో తొలిసారి డిప్యూటీ సీఎం పర్యటన..! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంతనియోజకవర్గంకు వస్తున్నఆయనకు జనసైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Janasena : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇవాళ పిఠాపురంలో పర్యటించనున్నారు. కాసేపట్లో గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గంకు వస్తున్న పవన్కు టీడీపీ (TDP) నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో పవన్ సమావేశం కానున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడ జిల్లా (Kakinada District) లో పర్యటించనున్నారు. Also Read: మీకు సేవకులుగా ఉంటాం..పెత్తందారులుగా కాదు..పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ సీఎం! రేపు కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 3న ఉప్పాడ తీరం పరిశీలించనున్నారు. అనంతరం పిఠాపురం (Pithapuram) లో వారాహి కృతజ్ఞతసభలో పవన్ ప్రసంగించనున్నారు. పవన్ చేబ్రోలు నివాసం దగ్గర అధికారులు భద్రత కట్టుదిట్టం ఏర్పాటు చేశారు. #ap-tdp #deputy-cm-pawan-kalyan #janasena #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి