TG News: బీజేపీ మాజీ ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా కేసు.. తప్పుడు సమాచారం ఇచ్చారంటూ! బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ ప్రభాకర్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్సి పరువునష్టం దావా కేసు వేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. By srinivas 07 Jun 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ ప్రభాకర్ కు ఊహించన షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్సి ప్రభాకర్ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. శుక్రవారం టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్ కి గౌడ్, రాష్ట్ర ముఖ్య నేతలతో కలిసి దీపాదాస్ కేసు వేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఎంపీలుగా గెలుపొందిన కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే అంజన్ కుమార్ యాదవ్ తదితరులు నాంపల్లి కోర్టుకు వెళ్లారు. #sv-prabhakar #defamation-case #deepa-das-munsi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి