Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ సైకిల్ యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు చేపట్టిన సైకిల్ యాత్ర13వ రోజుకు చేరుకుంది. ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు.

New Update
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ సైకిల్ యాత్ర

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా.. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణులు చేపట్టిన సైకిల్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. సైకిల్ యాత్ర13వ రోజుకు పంగులూరు మండలంలో కొనసాగింది. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలోని కశ్యపురం గ్రామం నుంచి మండలంలోని జనకవరం గ్రామం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేరా సైకిల్ యాత్ర సాగింది. సైకిల్ యాత్రలో భాగంగా తొలుత గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. అనంతరం గ్రామ మహిళలు హారతులు ఇచ్చిన తర్వాత సైకిల్ యాత్ర ప్రారంభమైంది. సైకిల్‌ యాత్ర చేస్తున్న గొట్టిపాటి రవికుమార్ పై గ్రామస్థులు పూల వర్షం కురిపించారు.

కశ్యపురం ఎస్‌సీ కాలనీ నుంచి రేణిగవరం, కొండమూరు, జనకవరం గ్రామాల మీదుగా, సైకిల్ యాత్ర చేరుకుంది. గ్రామ గ్రామాన గొట్టిపాటి సైకిల్ యాత్రకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. గత పది రోజుల నుంచి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సైకిల్ యాత్ర చేస్తున్నామన్నారు. మన నాయకుడి కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొరత ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే మండిపడ్డారు.

రైతులు రోడ్డు మీద పడవాల్సిన పరిస్థితి

పంటలు ఎండిపోతున్నా అధికారులు, ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. దీంతో రైతులు రోడ్డు మీద పడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ సాగు అవసరాలకు సరిపడినంత సరఫరా చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరున విదేశీ విద్యా అవకాశాలను కల్పించామన్నారు. ఈ ప్రభుత్వంలో రాజ్యాంగ నిర్మాత పేరును తొలగించి తన పేరు పెట్టుకుని కనీసం ఒకరికి కూడా విదేశీ విద్యా అవకాశాలు కల్పించలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: పచ్చని పొలాల మధ్య బైక్ సంచారం.. అసలేం జరిగిందంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: జగన్ మానసిక స్థితిపై అనుమానంగా ఉంది.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

జగన్‌పై హోంమంత్రి అనిత తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల బట్టలూడదిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. కాకీ చొక్కా CMR షాప్ నుంచి కొని తెచ్చుకుంది కాదు. ఊడదీస్తానని అనొచ్చా? అంటూ ఫైర్ అయ్యారు.

New Update
AP Home Minister Anitha: జగన్ పై చర్యలు.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

AP Home Minister Anitha fire on ys Jagan

AP News: ఏపీ మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్స్ చేశారు. పోలీసుల బట్టలూడదిస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన జగన్ శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో IPC సెక్షన్ ప్రకారం కాకుండా YCP సెక్షన్ ప్రకారం పోలీసులు పనిచేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో చట్ట ప్రకారమే నడుచుకుంటారని చెప్పారు. జగను మాటలు వింటే.. ఇదంతా క్రిమినల్ లీడర్ ఫ్రీ ప్లాన్ అని, ఇలా కూడా ఆలోచన చేస్తారా అనిపించిందన్నారు. జగన్ మాట్లాడుతుంటే వారి 5 ఏళ్ల అరాచక పాలన గుర్తుకొచ్చిందన్నారు.

2800 పై చిలుకు హత్యలు..

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన జనాలు మర్చిపోలేదు. ముసుగులేసుకుని కస్టోడీయల్ టార్చర్ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఇలాంటి సంస్కృతి మాది కాదు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, హోంమంత్రి అనేక కేసులు ఉన్నాయి. ఇవన్నీ ప్రశ్నించడంతో వల్ల పెట్టారు. CMR షాప్ నుంచి కొని తెచ్చుకోవడంతో వచ్చింది కాదు ఖాకీ చొక్కా. అటువంటి ఖాకీ చొక్క ఊడదీస్తానని అనొచ్చా? వైసీపీ హయాంలో 2800 పై చిలుకు హత్యలు జరిగాయి. ఇలా ప్రవర్తిస్తేనే 151 నుంచి 11కి దిగిపోయావు నువ్వు. ఇకనైనా మారకపోతే అవి కూడా రావన్నారు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

పెందుర్తి ట్రాఫిక్ అంశంపైనా పోలీసుల తప్పులేదు. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం కావడంతో 1100 మంది పోలీసులను పెట్టాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేశాం. కానీ వాట్సాప్ లో రెచ్చగొట్టే మెసేజ్ పెట్టారు. కావాలని ఓ సీన్ క్రియేట్ చేయాలని చూసారు. ఓ క్రిమినల్ నాయకుడు ఉంటే ఎలా ఉంటుందో నిన్న తెలిసింది. హెలిపాడ్ దగ్గరకు తీసుకుంటూ, నెట్టుకుంటూ వచ్చారు. కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయి. ఇంతచేసి పోలీసులను తప్పు పడుతున్నారు. 

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

జగన్ ముందస్తు ప్రణాళిక ప్రకారమే అదంతా చేశారుహెలికాప్టర్ దగ్గర జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. జగన్ వస్తున్నారనే సెక్యూరిటీ పటిష్టంగా ఉంచాం, జగన్ పర్యటనకు అడ్డు రాకూడదని ఎమ్మెల్యే పరిటాల సునీత స్వయంగా టీడీపీ కార్యకర్తలను ముందుగానే కోరారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారు.  వైసీపీ కార్యకర్తల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయి. మాజీ సీఎం కోసం 250 మంది పోలీసులు హెలిప్యాడ్ వద్ద ఉన్నారు. జగన్ హెలికాప్టర్ లో వెళ్లకుండా రోడ్డు మార్గంలో వెళ్లేందుకే హెలిప్యాడ్ దగ్గర గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం భద్రత దృష్ట్యా కేవలం ఒక సిగ్నల్ మాత్రమే నిలుపుతాం. జగన్ మానసిక స్థితిపై మాకు అనుమానంగా ఉందంటూ జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. 

 jagan | vanitha | police | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment