CSIR : ఇక నుంచి ఆరోజున ముడతల దుస్తులే వేసుకోండి...ఉద్యోగులకు సీఎస్‌ఐఆర్‌ ఆదేశాలు!

కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సెర్చ్‌ రీసెర్చ్‌ సంస్థ ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు సూచించింది. ఈ మేరకు వాహ్‌ మండేస్‌ ను ప్రారంభించింది. wrinkles Acche hai అనే నినాదం కూడా తెలిపింది. పర్యావరణ హితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

New Update
CSIR : ఇక నుంచి ఆరోజున ముడతల దుస్తులే వేసుకోండి...ఉద్యోగులకు సీఎస్‌ఐఆర్‌ ఆదేశాలు!

Wear Wrinkles Cloths  : సాధారణంగా పని చేసే కార్యాలయాలకు వెళ్తున్నామంటే మంచిగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడం చూస్తుంటాం. మరి కొందరు అయితే చాలా ప్రొఫెషనల్ గా ఫార్మల్స్‌, ఇన్‌ షర్ట్‌, టై, షూస్‌ ఇలా వెళ్తుంటారు. కంపెనీలు కూడా తమ ఉద్యోగస్తులు హుందాగా ఉండాలనే కోరుకుంటాయి. కానీ ఇక్కడ ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను ముడతలు పడ్డ దుస్తులను వేసుకుని రావాలని చెబుతుంది.

ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సెర్చ్‌(CSIR) ఇదే నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం రోజు ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు(Employees) సూచించింది. ఈ మేరకు వాహ్‌ మండేస్‌ ను ప్రారంభించింది. wrinkles Acche hai అనే నినాదం కూడా తెలిపింది. ఇదేంటి ఎవరైనా ఆఫీసులకు డీసెంట్‌గా రావాలని చెబుతారు.. కానీ ఇలా ముడతలు పడ్డ దుస్తులను ఎందుకు వేసుకురమ్మని ఆలోచిస్తున్నారా! ఇదేదో ట్రెండ్‌ అవ్వాలని తీసుకున్న నిర్ణయం కాదు. దీనివెనుక పెద్ద సామాజిక కోణమే ఉంది.

పర్యావరణ హితం కోసమే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నామని సీఎస్‌ఐఆర్‌ మహిళా డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎన్‌. కలై సెల్వి వెల్లడించారు. సాధారణంగా ఒక జత దుస్తులను ఐరన్‌ చేసినప్పుడు 200 గ్రాముల కార్బన్‌ డయాక్సైడ్‌(Carbon Dioxide) విడుదలవుతుందని ఆమె చెప్పారు. దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం పొడవునా కాకపోయినా కనీసం ఒక్క రోజు అయినా ఇలా ఇస్త్రీ లేని దుస్తులను ధరించేలా వాహ్‌ మండేస్‌ స్కీమ్‌ తీసుకొచ్చామని వివరించారు. ఇంధన అక్షరాస్యతలో భాగంగా విద్యుత్‌ వినియోగాన్ని 10 శాతం తగ్గించడంపై కూడా సీఎస్‌ఐఆర్‌ దృష్టి సారించింది.

Also read: నేడు ఏపీలో పిడుగులతో కూడి భారీ వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Omar Abdullah: పాక్‌ ప్రధానిపై ఒమర్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధానిపై జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ విమర్శించారు. ఈ దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

They didn't even recognise, Omar Abdullah on Pak's probe offer into Pahalgam

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం దీనిపై తటస్థ, పారదర్శక దర్యాప్తునకు తాము రెడీగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పాశమిక సంఘటనను పాకిస్థాన్‌ ముందుగా తోసిపుచ్చిందని.. భారత్‌పైనే నిందలు వేసిందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. '' పహల్గాంలో చోటుచేసుకున్న దాడిని వాళ్లు కనీసం గుర్తించలేదు.

Also read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌..! పాక్ మాజీ హైకమిషనర్‌ సంచలన కామెంట్స్‌

ఈ ఘటన వెనుక భారత్ ఉందని వాళ్లే మొదటగా ఆరోపించారు. మనపై ఎప్పుడూ ఆరోపణలు చేసేందుకు ముందుండే వాళ్లకు ఇప్పుడు మనమేమి చెప్పలేం. వాళ్లు చేసిన ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఈ ఘటన జరిగి ఉండాల్సింది కాదని'' సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఆయన ఖండించారు.  

Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..

ఇదిలాఉండగా.. పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. '' భారత్‌ నుంచి కచ్చింతగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని'' అబ్దుల్ బాసిత్ అన్నారు.

Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్‌ గాంధీ

Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!

telugu-news | rtv-news | national-news | Omar Abdullah 

Advertisment
Advertisment
Advertisment