/rtv/media/media_files/2025/01/22/k2a1PxS8tA7ieddI6aoA.jpg)
train accident Photograph: (train accident)
Maharashtra Train Accident: మహారాష్ట్రంలోని జల్గావ్కు 20 కిలో మీటర్ల దూరంలో బుధవారం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు చనిపోయారు. లక్నో నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్కు వెళ్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ ఎవరో టైన్ లాగారు. ట్రైన్లో మంటలు చెలరేగాయని వదంతు మొదలైంది. దీంతో రైల్లో ప్రయాణీకులు ఒక్కసారిగా ప్రాణభయంతో రైలు దిగి పరుగులు పెట్టారు. అదే సమయంతో మరో ట్రాక్ మీదుగా వెళ్లిన బెంగుళూర్ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు.
जलगांव के परांदा रेलवे स्टेशन के पास भीषण रेल हादसा।बंगलुरु एक्सप्रेस ने पुष्पक एक्सप्रेस के कई यात्रियों को उड़ाया।
— Indian Observer (@ag_Journalist) January 22, 2025
आग की अफवाह के बाद मची भगदड़ #breaking #maharashtra #Jalgaon #pushpakexpress #bigbreaking #train #accident #abpnews #india https://t.co/LSQFQBTBzS pic.twitter.com/dM3oTtN49D
మరో 8 మందికి తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలుస్తోంది. జల్గావ్ జిల్లాలోని పచోరా సమీపంలో జనవరి 22 సాయంత్రం 5గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. రైల్వే అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గుర్తిస్తున్నారు.
Read also ;భార్యను చంపి ముక్కులుగా కోసి, కుక్కర్లో ఉడకబెట్టి, చెరువులో పారేసిన భర్త
𝕁𝔸𝕃𝔾𝔸𝕆ℕ | At least 11 passengers were killed and 30-40 others injured in a tragic train accident in Jalgaon, Maharashtra. The incident occurred when a false fire alarm was raised on the Pushpak Express, causing panic among passengers. Some passengers jumped off the train… pic.twitter.com/ySGGRn4IVT
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) January 22, 2025
పుష్పక్ ఎక్స్ప్రెస్లోని ఒక కోచ్లో హాట్ యాక్సిల్ ( రైలు వీల్స్ సెక్షన్)లో బ్రేక్-బైండింగ్ కారణంగా చిన్నపాటి నిప్పు రవ్వలు, పొగ వచ్చిందట. వాటిని చూసిన కొంతమంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ట్రైన్ ఎమెర్జెన్సీ స్టాప్ చైన్ లాగారు. మంటలు మంటలు అనుకుంటూ కొందరు ప్యాసింజర్లు క్రిందికి దూకారు. భారీ అగ్ని ప్రమాదం అనుకొని కోచ్ లో ఉన్న అందరూ ప్రయాణికులు, పక్క భోగీ వారు కూడా ట్రైన్ నుంచి కిందికి దూకేశారు. అదే సమయంలో కర్నాటక ఎక్స్ప్రెస్ పక్కనే ఉన్న ట్రాక్పై ప్రయాణిస్తోంది. ఇలా ఈ ఘోరం జరిగిందని రైల్వే సీనియర్ అధికారి వివరించారు.
Also Read: ఐటీ రైడ్స్పై స్పందించిన దిల్రాజు.. ఏమన్నారంటే..?