HYD Rape Case: "జరిగింది రేప్ కాదు".. BJP మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సంచలనం..

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విదేశీయురాలిపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన సంఘటనపై BJP మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యాచారం కాదని, క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించాడని చెప్పారు.

New Update
HYD Rape Case

HYD Rape Case

HYD Rape Case: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన జరిగింది. పర్యటనకు వచ్చిన విదేశీయురాలి పై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు గుర్తు తెలియని ముగ్గురు యువకులు. లిఫ్ట్ పేరుతో సహాయం చేస్తాం అని చెప్పి మీర్పేట్ నుండి ఆమెను తీసుకుని వెళ్లారు ఆ ముగ్గురు యువకులు. పహాడీ షరీఫ్ అనే ఎవ్వరూ లేని ఒక నిర్మానుష్య ప్రాంతంలో తనని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు.

Also Read: హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం!

దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, లైంగిక దాడికి గురైన సదరు యువతి జర్మనీకి చెందిన మహిళగా గుర్తించారు. ఫిర్యాదులో తనపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొంది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక దాడి జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పరిశీలించి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

గ్యాంగ్-రేప్ లాంటివి ఏమి జరగలేదు: శిల్పా రెడ్డి

కాగా, ఘటనపై BJP మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది అత్యాచారం కాదు, క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు, కానీ ఆమె తప్పించుకుంది అని అన్నారు. బాధిత జర్మన్ మహిళను కలిసిన BJP మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి అత్యాచారం, గ్యాంగ్-రేప్ లాంటివి ఏమి జరగలేదని.

Also Read: ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్

లైంగిక దాడికి ప్రయత్నించగా తప్పించుకోవడానికి ఆమె కారు నుండి దూకేశారని తెలిపారు. తర్వాత ఆమె తన స్నేహితుడికి ఫోన్ చేసి పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తనిఖీ ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది, హైదరాబాద్ నుండి ఇలాంటి ఒక చేదు జ్ఞాపకంతో తన దేశానికి తెరిగి వెళ్లడం బాధాకరం అని తెలిపారు. 

Also Read: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

తైవాన్‌కి చెందిన ఎన్వీ(57) అతని మాజీ ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆమె తండ్రి అస్థికలు దొంగలించాడు. ఆమె మళ్లీ కలిస్తేనే అస్తికలు ఇస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎల్వీని అరెస్ట్ చేసి అస్థికలను ఆమెకి ఇచ్చేశారు.

New Update
Ashes

Ashes Photograph: (Ashes )

తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వ్యక్తి ఓ ప్లాన్ వేశాడు. ఆమె తండ్రి అస్థికలు దొంగలించి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయంగా ఫిభ్రవరిలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తైవాన్‌కు చెందిన ఎల్వి(57) అనే వ్యక్తి అతని మాజీ ప్రియురాలి తండ్రి అస్థికలను దొంగిలించాడు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2023లో ఎల్వీ, టాంగ్(48) మధ్య లవ్ బ్రేక్‌అప్ అయ్యింది. గత కొన్ని నెలల క్రితం టాంగ్ తండ్రి చనిపోయారు. ఆమె తన తండ్రి అంత్యక్రియల తర్వాత అస్థికలను జాగ్రత్తగా భద్రపరిచింది. 2023మేలో ఎల్వీ వాటిని దొంగలించాడు. 2025 లవర్స్ డే రోజు ఎల్వీ.. టాంగ్‌కు ఆమె తండ్రి అస్థికలు ఉన్న కలశం ఫొటో పంపాడు. ఆమె తిరిగి అతన్ని కలవడానికి అంగీకరిస్తేనే ఆ అస్థికలు ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఎల్వి 2023లో టాంగ్‌తో ఉన్న రిలేషన్‌ను కట్ చేసుకున్నాడు. 

Also read: Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఎల్వీకి ఆమెతో విడిపోవడం ఇష్టం లేదు. తరువాతి రెండేళ్లలో టాంగ్‌ను పదే పదే ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. మే 2023లో అతను టాంగ్ తండ్రి అస్థికలు ఉంచబడిన స్మశానవాటికను సందర్శించడం ప్రారంభించాడు. ఆమెను మానసికంగా ఒత్తిడి చేయడానికి ఆ కలశం దొంగిలించాలని అతను ప్లాన్ చేశాడు. టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అస్థికలు ఉన్న కలశం కోసం వెతకడం ప్రారంభించారు. ఎల్వీ కోళ్ల ఫారంలో అస్థికలు ఉన్న కలశం లభించింది. మార్చి 28న పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని శ్రీమతి టాంగ్‌కు తిరిగి ఇచ్చారు.  ఎల్వి ఇప్పటికే సంబంధం లేని చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్నాడు. 

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Advertisment
Advertisment
Advertisment