Corona New Version: కరోనా.. మళ్ళీ పెరుగుతోంది.. ఇప్పటి వేరియంట్ వలన ప్రమాదం ఎంత? 

కరోనా తాజాగా పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ వేరియంట్ అంత ప్రమాదం కాదని నిపుణులు అంటున్నారు. అయితే, వ్యాప్తిని నిరోధించడానికి జాగ్రత్తలు పాటించాలని.. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని వారు సూచిస్తున్నారు. 

New Update
Covid Alert:కరోనా బీభత్సం...ఒక్క నెలలోనే 10వేల మరణాలు

Corona JN1 : కరోనా వైరస్(Corona Virus) వచ్చి చాలా సంవత్సరాలు గడిచాయి.  కానీ, నేటికీ ఈ వైరస్ అంతరించిపోలేదు. గత నెల రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పేర్కొంది. ఈ సమయంలో, 3 వేల మంది మరణించారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ఆసుపత్రిలో చేరడం 24 శాతం పెరిగిందని రిపోర్ట్ లో పేర్కొన్నారు. అలాగే, మరణాల సంఖ్య కూడా పెరిగింది. దాదాపు 40 దేశాల నుంచి వచ్చిన కోవిడ్ డేటా ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికను తయారు చేసింది.

ఈ నెలలో కొత్త JN.1 కోవిడ్(Corona New Version) వేరియంట్ కేసులు 26 శాతం పెరిగాయని WHO నివేదికలో చెప్పింది.  చాలా మంది రోగులలో తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ, ఈ వేరియంట్ పెరుగుతున్న తీరును బట్టి, అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని WHO సూచించింది.

భారత్‌లోనూ కేసులు పెరుగుతున్నాయి

భారతదేశంలో కూడా, గత 15 రోజుల నుంచి  కోవిడ్(Corona New Version) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారత్‌లో యాక్టివ్‌గా ఉన్న కరోనా రోగుల సంఖ్య 3742కి చేరుకుంది. కొత్త వేరియంట్ JN.1 22 కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. . భారత్ లో  గత వారంలో కోవిడ్  క్రియాశీల కేసుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిలో, ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగా భారతదేశంలో కోవిడ్ ప్రమాదం పెరుగుతోందా? దీని గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం. 

భారత్ లో ప్రమాదం ఉందా? 

కోవిడ్ డేటా ప్రకారం, భారతదేశంలో కరోనా కేసులు(Corona JN1) పెరుగుతున్నాయి.. అదేవిధంగా రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయనే భయం ఉంది.  కానీ ఇప్పుడు కరోనాతో పెద్ద ప్రమాదం లేదు. ఇప్పటివరకు, కోవిడ్ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఆసుపత్రిలో చేరడం కూడా పెరగలేదు. ఇప్పటికే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న రోగులను మాత్రమే ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితిలో, భారతదేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున భయపడాల్సిన అవసరం లేదు అని నిపుణులు అంటున్నారు. 

Also Read: ఫ్రాన్స్‌ లో చిక్కుకున్న భారతీయుల విమానానికి లైన్‌ క్లియర్‌..నేడు భారత్‌ కు!

కొత్త వేరియంట్ ఎంత ప్రమాదం?

కోవిడ్ JN.1 వేరియంట్ ఓమిక్రాన్ ఉప-వేరియంట్ అని శాస్త్రవేత్తలు చెప్పారు.  ప్రపంచవ్యాప్తంగా దీని కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా కేసులు నమోదయ్యాయి.  కానీ, ప్రజలు తేలికపాటి లక్షణాలను మాత్రమే ఎదుర్కొంటున్నారు. ఈ వేరియంట్‌పై ఇప్పుడు ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇది తేలికపాటిదిగా ఉంటే, పెద్దగా ఆందోళన పడాల్సిన  పని లేదు. 

బూస్టర్ అవసరమా?

ప్రజలు తమ వైద్యుని సలహా మేరకు కోవిడ్ బూస్టర్(Corona New Version) మోతాదును తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.  టీకాలు వేయడం ద్వారా, వైరస్ కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలు శరీరంలో ఏర్పడతాయనీ,  దీని కారణంగా వైరస్ తీవ్రమైన లక్షణాలను కలిగించదనీ నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు వంటి అధిక-ప్రమాదకర వ్యక్తులు బూస్టర్ మోతాదును తీసుకోవచ్చని వారంటున్నారు. 

జాగ్రత్తలు అవసరం.. 

కరోనా(Corona New Version) వైరస్ వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. దేశంలో చాలా మందికి రెండు డోసుల కోవిడ్‌ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు.  అటువంటి పరిస్థితిలో, వైరస్ నుంచి  తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్న మాట. అయితే ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాలను నివారించాలనీ అలాగే  బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలనీ సూచిస్తున్నారు. ఇంతకు ముందు కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించినట్లే, ఇప్పుడు కూడా అదే పని చేయాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

Watch this interesting Video :

Advertisment
Advertisment
తాజా కథనాలు