Telangana: కాటారం అడవిలో దారుణం.. వేటగాళ్ల కరెంట్ ఉచ్చుకు కానిస్టేబుల్‌ బలి

వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగ తగిలి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఆడె ప్రవీణ్‌ మరణించాడు. ఆదివారం రాత్రి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

New Update
Telangana: కాటారం అడవిలో దారుణం.. వేటగాళ్ల కరెంట్ ఉచ్చుకు కానిస్టేబుల్‌ బలి

Bhupalpalli: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం శివారు అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన కరెంట్ తీగ తగిలి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ మృతిచెందారు. కూంబింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సంబంధింత అధికారులు వెల్లడించారు.

ఆదివారం రాత్రి కూంబింగ్‌..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 13 మంది గ్రేహౌండ్స్‌ పోలీసులు కాటారం శివారు అటవీలో ఆదివారం రాత్రి కూంబింగ్‌ చేపట్టారు. అయితే రాత్రి 10:15 సమయంలో కాటారం-మహదేవపూర్‌ ప్రధాన రహదారికి 600మీటర్ల దూరంలో వన్య ప్రాణుల వేటకోసం గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్తు తీగలకు అమర్చారు. అనుకోకుండా ఆ తీగలు తగిలి ఆడె ప్రవీణ్‌(34) అనే కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

ఇది కూడా చదవండి : Kanpur: పూనమ్ పాండే దంపతులపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా!?

తీవ్రగా గాయాలు..
అయితే ప్రవీణ్ చేయి, కాలు, పొట్టభాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే కాటారం సీఐ రంజిత్‌రావు, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని అంబులెన్స్‌లో భూపాలపల్లికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం రాజోలుగూడకు చెందిన ప్రవీణ్ కు భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని భూపాలపల్లి ఓఎస్డీ అశోక్‌కుమార్‌, కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. వేటగాళ్లు అమర్చిన తీగను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment