AP: నందిగామ టీడీపీలో పోటా పోటీ.. మున్సిపల్ పీఠం కోసం ఎవరికి వారు ఏం చేస్తున్నారంటే..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ పీఠం కోసం టీడీపీలో పోటా పోటీ నడుస్తోంది. ఛైర్మన్ పదవి తమకు కావాలి అంటే తమకు కావాలని నలుగురు కౌన్సిలర్లు లాబియింగ్ చేస్తున్నారు. ఛైర్మన్ వరలక్ష్మి, వైస్ ఛైర్మన్ నాగరత్నం అనారోగ్య కారణాలతో మృతిచెందగా రెండు వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.

New Update
AP: నందిగామ టీడీపీలో పోటా పోటీ.. మున్సిపల్ పీఠం కోసం ఎవరికి వారు ఏం చేస్తున్నారంటే..

NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ పీఠం కోసం టీడీపీలో పోటా పోటీ నడుస్తోంది. ఛైర్మన్ పదవి తమకు కావాలి అంటే తమకు కావాలని నలుగురు కౌన్సిలర్లు లాబియింగ్ చేస్తున్నారు. తమకు ఒక చాన్స్ ఇవ్వాలని అధినాయకత్వాని కౌన్సిలర్లు ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు గాను టీడీపీ 10 మంది కౌన్సిలర్లు బలంగా ఉన్నారు. ఛైర్మన్ వరలక్ష్మి, వైస్ ఛైర్మన్ నాగరత్నం అనారోగ్య కారణాలతో మృతి చెందగా రెండు వార్డుల్లో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

గతంలో వైసీపీకి ఉన్న 13 మంది కౌన్సిలర్లలో ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీ 10 జనసేన 1తో మున్సిపల్ ఛైర్మన్ టీడీపీ కౌవసం చేసుకునే అవకాశం ఉంది. పోటీలో 5 వార్డ్ కౌన్సిలర్ ఏచూరి రత్నకూమారి, 8 వార్డు కౌన్సిలర్ శాఖమూరి స్వర్ణ లత,10 వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణ కుమారి,14 వార్డు కౌన్సిలర్ కామసాని సత్యవతి పార్టీలో తమ కష్టాన్ని గుర్తించి తమకు చాన్స్ ఇవ్వాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తోన్నారు.

ఇప్పటికే నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కసరత్తు చేస్తున్నారు. దీంతో ఎవరికి మున్సిపల్ ఛైర్మన్ పదవి వరిస్తుందో అని కౌన్సిలర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. ఛైర్మన్ బరిలో ఉన్న 4 కౌన్సిలర్లు మూడున్నర సంవత్సరాల ప్రతిపక్షంలో పనిచేసిన తీరు చూస్తే..

శాఖమూరి స్వర్ణ లత 2020 నందిగామ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోటీ చేసి 8 వార్డు కౌన్సిలర్ గా గెలిచారు. గతంలో నందిగామ సర్పంచ్ గా చేసిన అనుభవం ఉంది. నందిగామ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉండి అధికార పక్షాన్ని నిలదీసి వారు చేసిన తప్పులను ఎండ గట్టడంలో ముందు ఉన్న సందర్భాలు లేకపోలేదు.

ఏచూరి రత్నకూమారి భర్త రాము పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పట్టణ అధ్యక్షుడు బాధ్యత తీసుకుని పార్టీని పట్టణంలో బలోపేతానికి కృషి చేశారు. నందిగామ పట్టణంలో ఉన్న ఓటర్లను స్థానిక నాయకులతో కలిసి నందిగామలో 4000 పైగా మైనస్ లో తెలుగు దేశం పార్టీ ని 2024 ఎన్నికల్లో 8000 ఓట్ల మెజారిటీ వచ్చేందుకు తన వంతు పాత్ర పోషించాడు.

కౌన్సిలర్ కామసాని సత్యవతి ఎప్పటి నుంచో టీడీపీలో కోనసాగుతూ 2020లో 14 వార్డు కౌన్సిలర్ పోటీ చేసి గెలిచారు. తన వయస్సు రిత్యా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని అందుచేత తనకు ఒక చాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. మండవ కృష్ణ కుమారి పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతు ప్రయత్నం చేశారు. తన తోటి కోడలు వరలక్ష్మి చేసిన చైర్మన్ పదవిని మిగిలిన 18 నెలలకు తనకు ఒక చాన్స్ ఇవ్వాలని మండవ కృష్ణ కుమారి ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి.. బాలికపై హత్యాచారం కేసులో..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Posani Krishna Murali: పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?

పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.

New Update

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ పోలీసులు మరో బిగ్‌ షాక్‌ ఇచ్చారు. తాజాగా పోసానిపై మరో కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు. నిన్న సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందించారు. పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే కపలు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఫిబ్రవరిలో అరెస్ట్..

చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి 26న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లో పోలీసులు హైదరాబాద్ లోని పోసాని నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు ఆయనపై నమోదయ్యాయి. సీఐడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి 22న పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. కానీ నో రిలీజ్

నెల రోజులకు పైగా జైల్లో..

దాదాపు నెల రోజులకు పైగా ఆయన ఈ కేసుల్లో జైల్లో ఉన్నారు. కేసు గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడవద్దని.. రూ.2 లక్షల విలువతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలని బెయిల్ మంజూరు సమయంలో హైకోర్టు పోసానికి స్పష్టం చేసింది. నాలుగు వారాల పాటు ప్రతీ మంగళ, గురువారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు మంగళగిరి లోని ఏపీ సీఐడీ ఆఫీసుకు వచ్చి సంతకం చేయాలని స్పష్టం చేసింది. 

(posani krishna murali arrest | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment