CM Revanth Reddy: వారిపై ఫోకస్ పెట్టండి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు TG: హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించారు. అధికారులు డబ్బులు డిమాండ్ చేసినట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిపై ఏసీబీ, విజిలెన్స్ ఫోకస్ పెట్టాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. By V.J Reddy 29 Aug 2024 in Latest News In Telugu మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: హైదరాబాద్ లో హైడ్రా (Hydra) పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై సీఎం రేవంత్ స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. ఎవరినీ ఉపేక్షించేది లేదు: ముఖ్యమంత్రి హెచ్చరిక హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి… — CPRO to CM / Telangana (@CPRO_TGCM) August 29, 2024 Also Read: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు! #cm-revanth-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి