/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates
🔴Live News Updates:
Hyderabad Metro: వివాదంలో హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం
హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
/rtv/media/media_files/2025/03/29/wLVnmuOzyYgsgxWJGzg7.jpg)
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్.. వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మెట్లో రై ళ్లలో యథేచ్ఛగా జరుగుతున్న బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ను తక్షణమే దాఖలు చేయాలని ఆదేశించింది.
Also Read: Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
మెట్రో రైళ్లలో చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ.. హైకోర్టులో అడ్వకేట్ నాగూర్ బాబు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో నిబంధనలను ఖతారు చేయకుండా అధికారులు ఎలా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లకు అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది యువతను తప్పుదారిలోకి మళ్లించే ప్రమాదం ఉందని అన్నారు.
Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
మరోవైపు.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 స్పష్టంగా అమల్లో ఉన్నప్పటికీ, HMRL తో పాటు దాని అనుబంధ సంస్థలు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడానికి భారీగా ముడుపులు అందుకున్నారని పిటిషన్లో ఆరోపించారు. ఈ అక్రమ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ కుంభకోణంలో ఎంత మంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పిటిషన్పై గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కీలక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం, ప్రతివాదులైన HMRL ఎండీకి నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు న్యాయ నిపుణులు అంటున్నారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది HMRL నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.
Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన
-
Apr 25, 2025 21:25 IST
ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు
కొమురం భీం జిల్లా జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన చత్రుషావ్ ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టాడు. ఒక యువతితో నాలుగేళ్లు.. మరో యువతితో ఏడాది పాటు ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం తెలిసి ఇద్దరు యువతులు అతడ్నే పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చారు.
telangana young man Photograph: (telangana young man) -
Apr 25, 2025 16:46 IST
ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!
-
Apr 25, 2025 15:08 IST
నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి
-
Apr 25, 2025 15:07 IST
రిపీటైతే తీవ్ర చర్యలుంటాయ్.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్!
-
Apr 25, 2025 09:55 IST
Hyderabad MLC Elections: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.
-
Apr 25, 2025 08:23 IST
BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..
-
Apr 25, 2025 07:45 IST
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఇకపై ఉచితంగానే..!
-
Apr 25, 2025 07:44 IST
Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
-
Apr 25, 2025 06:51 IST
RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ
-
Apr 25, 2025 06:50 IST
Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
-
Apr 25, 2025 06:50 IST
Air india: పహల్గాం ఉగ్రదాడి... కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్ ఇండియా!
CM Revanth Reddy: కోదండరాంను ప్రశ్నించేంత పెద్దోళ్లా?.. కుట్రతోనే అడ్డుకున్నారు.. మండపడ్డ సీఎం రేవంత్
చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు.
CM Revanth Reddy: చట్టసభకు వెళ్లకుండా కోదండరాంను (Prof Kodandaram) అడ్డుకునేందుకు బీఆర్ఎస్ (BRS) కుట్రలు పన్నిందంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమసారథిగా నిలిచిన కోదండరాం గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపికను ప్రశ్నించడం భావదారిద్ర్యమే అవుతుందన్నారు. రాజీకీయ కుట్రతోనే ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాన్ని (MLC Oath) వాయిదా వేయించారని ఆరోపించారు. కేసీఆర్ (KCR) దొడ్లో చెప్పులు మోసిన వారితో కోదండరాంను పోల్చవద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలోనే ప్రజల్లోకి వస్తానని స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి: పద్మ శ్రీ పురస్కార గ్రహితలను సత్కరించిన .. మెగాస్టార్ చిరంజీవి
తెలంగాణ హక్కులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు . ‘‘పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టుల గురించి అసలు పట్టించుకోలేదన్నారు. బ్లాక్ మనీ వెనక్కు తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని మాటతప్పారంటూ మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి మాటలకే పరిమితమయ్మాయారన్నారు. రాష్ట్రంలో పండిన వరిని కూడా కొనలేని స్థితిలో కేంద్రం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: ఆపరేషన్ ఏపీ.. చిరంజీవిని రాజ్యసభకు పంపే ప్లాన్? బీజేపీ స్ట్రాటజీ ఇదేనా?
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ దృష్టి పెట్టిందంటూ సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇప్పటికీ అమలు కాలేదని దుయ్యబట్టారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసినట్టుగానే, కేంద్రంలో మోదీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారానే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారని సీఎం విమర్శించారు.
🔴Live News Updates: ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు
Stay updated with the latest live news Updates......... క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని
పాకిస్తానీ యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కి చెందిన యువతిని వివాహం చేసుకున్న మహమ్మద్ ఫయాజ్.. Short News | Latest News In Telugu | వైరల్ | హైదరాబాద్ | నేషనల్ | తెలంగాణ
Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి
పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పి కారు లోయలో పడటంతో ఐదుగురి మృతి చెందారు. ఈ దుర్ఘటన క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?
Marriage Newsకొమురం భీం జిల్లా జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన చత్రుషావ్ ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టాడు. Short News | Latest News In Telugu | వైరల్ | ఆదిలాబాద్ | తెలంగాణ
AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!
రేపు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. 'మత్స్యకార సేవలో' అనే పేరుతో సీఎం కొత్త పథకాన్ని Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Aloe Vera Juice: ఉదయాన్నే కలబంద రసం తాగితే 100 వ్యాధులు దరిచేరవు
కలబంద రసం ఖాళీ కడుపుతో తాగితే శరీరాన్ని ఉత్తేజ పరచి, అనేక వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇది శరీరంలో అలసట, తలనొప్పి, బరువు పెరగడం, రోగనిరోధక శక్తి బలహీనపడటం మొదలైన సమస్యలను తగ్గిస్తుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్
🔴Live News Updates: ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు
BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని
Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి
Marriage News: ఎవడ్రా వీడు.. ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు- వీడియో చూశారా?