Rythu Runa Mafi: రుణమాఫీకి కొత్త రూల్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం... !

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీపై మంత్రులతో రేవంత్ చర్చించనున్నారు. గతేడాది డిసెంబర్ 9 లోపు రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈరోజు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

New Update
Rythu Runa Mafi: రుణమాఫీకి కొత్త రూల్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం... !

Rythu Runa Mafi: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. భేటీలో పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రైతు రుణమాఫీ అమలుపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. గత డిసెంబర్ 9 వరకున్న రుణాలకు మాఫీ వర్తింపు అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే.

సోనియాగాంధీ పుట్టిన రోజుతో పాటు తెలంగాణ ప్రకటన తేదీ కావడంతో రేవంత్ సర్కారు సెంటిమెంట్‌ గా పెట్టుకుంది. రైతు కాకుండా రైతు కుటుంబం యూనిట్‌గా అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వడ్డీతో కలిపి రుణమాఫీ చేసేందుకు దాదాపు రూ. 40వేల కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. ఒకేసారి రుణమాఫీ సాధ్యాసాధ్యాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. మార్గదర్శకాల రూపకల్పనపై అధికారుల కసరత్తు చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు