CM Ramesh: వైసీపీలో వీళ్లు తప్ప ఎవరూ మిగలరు.. సీఎం రమేష్ హాట్ కామెంట్స్

ఏపీలోని అన్ని ప్రాంతలలోనూ నాయకులు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారన్నారు సీఎం రమేష్. జగన్ ను కుటుంబ సభ్యులే చికొడుతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ లో విజయసాయి రెడ్డి, మిథిన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, సుబ్బారెడ్డి తప్పితే ఆ పార్టీ లో ఎవరు మిగలరని పేర్కొన్నారు.

New Update
CM Ramesh: వైసీపీలో వీళ్లు తప్ప ఎవరూ మిగలరు.. సీఎం రమేష్ హాట్ కామెంట్స్

CM Ramesh:  అనకాపల్లి జిల్లాలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. ఏపీలోని అన్ని ప్రాంతలలోనూ నాయకులు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారన్నారు. జగన్ ను కుటుంబ సభ్యులే చికొడుతున్నారని కామెంట్స్ చేశారు.  జగన్మోహన్ రెడ్డికి నాయకులు అంటే చిన్నచూపు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎంపీ లు, ముఖ్య నాయకులు వైసీపీని విడి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

Also Read: వేసవి వద్దు.. సంక్రాంతి ముద్దు అంటున్న స్టార్స్.. అందరూ అప్పుడే.. 

వైసీపీలో విజయసాయి రెడ్డి, మిథిన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, సుబ్బారెడ్డి తప్పితే ఆ పార్టీలో ఎవరు మిగలరన్నారు. తెలంగాణ లో ప్రజా వ్యతిరేక విధానాలు చేయబట్టే బీ ఆర్ ఎస్ ను ప్రజలు గద్దె దించారని కామెంట్స్ చేశారు. నాయకులను పార్టీ నుండి బయటకు రావడానికి జగన్ అనుమతి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. లేదంటే ఎప్పుడో వైసీపీ ఖాళీ అయిపోయేదని వ్యాఖ్యనించారు. వైసీపీ పార్టీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలలో చేరిన సర్పంచ్ లకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ వంద గంటలు కూడా ఉండదన్నారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఉరుకోనని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని..జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి జగన్ యువతను మోసం చేశాడని మండిపడ్డారు. జగన్ ఆయన భజన బృందం జాబులు ఇవ్వకుండా వారి జోబిని నింపుకున్నారని ఫైర్ అయ్యారు. యువతని, రైతులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఆ దేవుడు కూడా క్షమించడన్నారు. తాను గెలిచిన ఆరు నెలలు లోనే ఇబ్బందులలో ఉన్న చెరకు రైతులను అదుకుంటానని హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారని చెప్పారు. 

author-image
By Manogna alamuru
New Update
MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ దువ్వాడపై మొత్తానికి వేటు పడింది. గత కొన్ని రోజలుగా వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చర్యలు తీసుకున్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పినట్లు ఫిర్యాదులు రావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 

జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే..

పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే దువ్వాడను సస్పండ్ చేశారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జి పేరాడ తిలక్ కి మద్దతు తెలపమని జగన్ అడిగారు. కానీ దీనికి దువ్వాడ ఒప్పుకోలేదు. దీంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారని చెబుతున్నారు. నాయకుడు చెప్పిన వెంటనే సస్పెన్షన్ ను అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ.  దీంతో ఇప్పటి వరకు జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో అని పార్టీ జనాలు అనుకుంటున్నారు. ఇతని సస్పెన్షన్ తో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిణించాయని..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హాస్తం వుందని మాట్లాడుకుంటున్నారు. 

 

ap
Mlc Duvvada suspention

 

 

 today-latest-news-in-telugu | duvvada-srinivas | ycp | suspend

Also Read: J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు