Odisha: ఒడిశాలో గవర్నర్ ప్రసంగం నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు!

ఒడిశాలో అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్నిప్రతిపక్ష BJD, కాంగ్రెస్ పార్టీలు బహిష్కరించాయి. అంతకముందు రాజ్ భవన్ లో ఓ అధికారి పై గవర్నర్ కుమారుడు దాడి చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాదం పై గవర్నర్ చర్యలు తీసుకోకపోవటంతో ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

New Update
Odisha: ఒడిశాలో గవర్నర్ ప్రసంగం నుంచి వాకౌట్ చేసిన ప్రతిపక్షాలు!

Odisha Assembly: గవర్నర్ రఘుబర్ దాస్ (Governor Raghubar Das) ప్రసంగాన్ని  ప్రతిపక్ష బిజూ జనతాదళ్ (BJD), కాంగ్రెస్ (Congress) రెండూ బహిష్కరించడంతో 17వ ఒడిశా అసెంబ్లీ తొలి సెషన్ సోమవారం కోలాహలంగా ప్రారంభమైంది. పూరీలోని రాజ్‌భవన్‌ అధికారిపైన గవర్నక్ కుమారుడు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.దీంతో అతడిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిపక్షం గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించింది.

సభా కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష నేత, బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. బీజేడీ సభ్యుల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీ శాసనసభా పక్ష నేత రామ్‌చంద్ర కదమ్‌ ఆధ్వర్యంలో సభ నుంచి వాకౌట్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగి పై గవర్నర్  కుమారుడు దాడి చేశారంటూ గవర్నర్‌ ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించాయి. అసెంబ్లీ వెలుపల పట్నాయక్ విలేకరులతో మాట్లాడుతూ, “ప్రభుత్వ అధికారిపై హింసకు పాల్పడిన గవర్నర్ కుమారుడిపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూసి నా పార్టీ, నేను నిరాశ  ఆశ్చర్యానికి గురయ్యాము. ఈ సంఘటన మన రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలినట్లు కనిపిస్తోంది.

Also Read: ఫ్యాషన్ షో లో మోదీ,పుతిన్ వీడియోను షేర్ చేసిన మస్క్!

తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ప్రభుత్వోద్యోగులు చట్టాన్ని ఉల్లంఘిస్తే వెంటనే చర్యలు తీసుకునేవారు. రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం పని చేయాలి. దీని కారణంగా, సెషన్ ప్రారంభంలోనే నా పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.'' అదే సమయంలో, ఒరియా మాట్లాడే గవర్నర్ కుమారుడు కారణంగా ఒరియా 'అస్మిత' (గర్వం) దెబ్బతిందని కాంగ్రెస్ పేర్కొంది. ఒరియా మాట్లాడే అధికారిని అవమానించారని ఆరోపించారు.

పార్టీ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినీపాటి మాట్లాడుతూ, “ఒడియా మాట్లాడే అధికారిపై ఒరియాయేతరుడైన గవర్నర్ కుమారుడు దాడి చేశాడు. దీనిపై గవర్నర్‌కు వెంటనే సమాచారం ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఏడు రోజుల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దాస్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గవర్నర్ హిందీలో తన ప్రసంగాన్ని చదువుతున్నప్పుడు, బిజెపి ఒరియా 'అస్మిత' ఎక్కడ ఉంది?

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కోసం డ్యూటీలో ఉన్న పూరీలోని ఒడిశా రాజ్‌భవన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)పై గవర్నర్ కుమారుడు లలిత్ కుమార్ జూలై 7న దాడికి పాల్పడ్డారు. ASO ఇప్పుడు హోం శాఖకు బదిలీ చేయబడింది. మరుసటి రోజు పూరీలోని సీ బీచ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా నిందితులపై చర్యలు తీసుకోలేదు.

Also Read: అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌ వాటా పెరిగింది..ఆనంద్ నాగేశ్వరన్!

Advertisment
Advertisment
తాజా కథనాలు