AP Crime : ఏపీలో దారుణం... వైన్‌ షాపు దగ్గర గొడవ.. ఒకరి హత్య!

తణుకు మండలం దువ్వ గ్రామంలోఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మద్యం తాగిన మత్తులో గొడవ జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణ భాస్కరరావు మీద గాజు పెంకుతో దాడి చేసి హత్య చేశాడు.

New Update
AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!

West Godavari District : ఫుల్లుగా మద్యం (Liquor) తాగి కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో పక్కవారితో గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తాగిన మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా.. ఓ వ్యక్తి దారుణ హత్య (Killed) కు గురయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు (Tanuku) మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఈ దారుణ ఘటన (Clash Near Wines) చోటు చేసుకుంది. పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య దువ్వలోని ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే, గొడవ ఎందుకని వెనక్కి తగ్గిన భాస్కరరావు మోటారుసైకిల్‌పై వెళ్లిపోతుండగా అతడి పై గాజుపెంకుతో దాడి చేసి చాతీ భాగంలో పొడిచాడు రామకృష్ణ అనే వ్యక్తి.

అయినప్పటికీ కూడా భాస్కరరావు అలాగే బండిపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు భాస్కరరావు మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఘటనా స్థలానికి తణుకు రూరల్‌ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై కె.చంద్రశేఖర్‌ చేరుకున్నారు. ఘటన గురించి కేసు నమోదు చేసి నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Also read: రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం

ఆంధ్రప్రదేశ్ లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని ఉన్న కియా పరిశ్రమ నుంచి కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 900 కనిపించకుండా పోయాయి. దీనికి సంబంధించి కియా యాజమాన్యం కిందటి నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

New Update
ap

KIA Industry

కియా ప్లాంట్ లో ఇంజిన్లు పోయాయి. నమ్మశక్యంగా లేకపోయినా..ఇది నిజంగా జరిగింది. అది కూడా ఆంధ్రాలో ఉన్న కియా పరిశ్రమలో. అది కూడా ఏదో ఒకటి , రెండో పోతే పర్వాలేదులే అనుకోవచ్చును. కానీ ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. దీనికి సంబంధించి కియా ప్లాట్ ఓనర్లు మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దొంగతనం విషయంలో కియా యాజమాన్యం ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. కానీ దీనికి పోలీసులు నిరాకరించడంతో కంప్లైంట్ ఫైల్ చేశారు.  విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.

ఎక్కడ మాయం అయ్యాయో..

అయితే ఈ కార్ల ఇంజిన్లు ఎక్కడ పోయాయి అన్నది మాత్రం తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్న ప్లాంట్లో కార్లు తయారవుతాయి కానీ విడి భాగాలు అన్నీ ఒక్కో చోట నుంచీ వస్తాయి. కార్ల ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. ఇప్పుడు మాయం అయిన ఇంజిన్లు తమిళనాడు నుంచి రవాణా అవుతున్నప్పుడు పోయాయా లేక పరిశ్రమలోనే చోరీ అయ్యాయా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ పూర్తి చేశారని...త్వరలోనే మీడియా సమావేశం పెట్టి వివరాలు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

 today-latest-news-in-telugu | kia | cars | andhra-pradesh 

 

Also Read: Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

 

Advertisment
Advertisment
Advertisment