Nirmal : హాస్టల్ లో కొట్టుకున్న విద్యార్థులు.. ఒకరు మృతి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి మైనార్టీ గురుకులంలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గొడవపడి దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో సయ్యద్ హర్బజ్ అనే విద్యార్థి మృతి చెందాడు. By srinivas 09 Feb 2024 in క్రైం ఆదిలాబాద్ New Update షేర్ చేయండి Crime : తెలంగాణ(Telangana) లోని ఓ గురుకుల హాస్టల్ లో దారుణం జరిగింది. చిన్న విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలవగా అది భౌతిక దాడులకు దారితీసింది. ఒకరినొకరు విచక్షణ మరిచి బూతులు తిట్టుకోవడంతోపాటు గళ్లాలు పట్టి కొట్టుకున్నారు. ఈ గొడవ(Clash) లో చివరికి ఒకరు మరణించిన ఘటన తెలంగాణ(Telangana) లోని నిర్మల్ జిల్లా(Nirmal District) లో జరిగింది. వెనక నుంచి తోసి.. హాస్టల్ యాజమాన్యం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి మైనార్టీ గురుకులం(Gurukul Hostel) లో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన సయ్యద్ హర్బజ్ అలీ(16), నిర్మల్ పట్టణం గాజులపేట్కు చెందిన విద్యార్థి(16) మధ్య రాత్రి చిన్నపాటి ఘర్షణ జరిగింది. అయితే ఇందులో భాగంగా విచక్షణ కొల్పోయిన గాజులపేట్ విద్యార్ధి.. సయ్యద్ హర్బజ్ ను వెనక నుంచి తోశాడు. దీంతో హర్బజ్ బోర్లా పడిపోగా తీవ్రంగా గాయపడ్డాడు. ఇది కూడా చదవండి : Bald : మగవారికే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ? విషయం గమనించి హర్బజ్ అలీ(Harfaj Ali) ని నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే హర్బజ్ మృతి చెందాడని చెప్పారని హాస్టల్(Hostel) ప్రిన్సిపల్ చెప్పారు. హర్బజ్ అలీ కుటుంబ సభ్యులు విద్యాలయానికి చేరుకుని.. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. #10th-class-student #nirmal-district #gurukul-hostel #clash సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి