/rtv/media/media_files/2026/04/24/dhruva-natchathiram-2026-04-24-11-58-48.jpg)
Dhruva Natchathiram
Dhruva Natchathiram: ఎప్పటోనుంచో విడుదల కోసం ఎదురు చూస్తున్న స్పై థ్రిల్లర్ ధ్రువ నక్షత్రం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన కీలక కేసు తీర్పు నేడు (ఏప్రిల్ 24, 2026) మద్రాస్ హైకోర్టు ప్రకటించనుంది. దీంతో సినిమా విడుదలపై ఉన్న అనుమానం త్వరలో క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
ఈ వివాదం ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. కొందరు ఇన్వెస్టర్లు పున్నియమూర్తి, ప్రీమకుమార్ అనే వారు, 2016లో జరిగిన ఒక వేరే సినిమా పంపిణీ ఒప్పందానికి సంబంధించిన బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని కోర్టును ఆశ్రయించారు. 2023లో కోర్టు తాత్కాలికంగా సినిమా విడుదలను నిలిపివేసింది.
ఈ కేసు మదన్ పాండీ, ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్కు సంబంధించిన ఆర్థిక ఒప్పందాల వరకు వెళ్లింది. దీంతో మధ్యవర్తిత్వం, చట్టపరమైన సమస్యలు ఇలా చాలా కాలంగా ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నాయి. ఇదే కారణంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది.
ఈ సినిమాలో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించగా, సిమ్రాన్, ఋతు వర్మ, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ రోజు వచ్చే నిర్ణయంపైనే ఉంది. ఈ తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సాఫీ అవుతుందా లేదా అనే విషయం స్పష్టమవుతుంది.
Follow Us