Dhruva Natchathiram: విక్రమ్ "ధ్రువ నక్షత్రం" రిలీజ్ కష్టాలు తీరేనా?

ధ్రువ నక్షత్రం విడుదలపై ఉన్న ఆర్థిక వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పు ఈరోజు (ఏప్రిల్ 24, 2026) ఇవ్వనుంది. బకాయిలు కారణంగా విడుదల ఆగిపోయిన ఈ కేసులో నిర్ణయం వస్తే సినిమా విడుదలకు మార్గం సాఫీ అయ్యే అవకాశం ఉంది. విక్రమ్ నటించిన ఈ చిత్రం పై అందరి దృష్టి ఉంది.

New Update
Dhruva Natchathiram

Dhruva Natchathiram

Dhruva Natchathiram: ఎప్పటోనుంచో విడుదల కోసం ఎదురు చూస్తున్న స్పై థ్రిల్లర్ ధ్రువ నక్షత్రం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన కీలక కేసు తీర్పు నేడు (ఏప్రిల్ 24, 2026) మద్రాస్ హైకోర్టు ప్రకటించనుంది. దీంతో సినిమా విడుదలపై ఉన్న అనుమానం త్వరలో క్లియర్ అయ్యే అవకాశం ఉంది.

ఈ వివాదం ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. కొందరు ఇన్వెస్టర్లు పున్నియమూర్తి, ప్రీమకుమార్ అనే వారు, 2016లో జరిగిన ఒక వేరే సినిమా పంపిణీ ఒప్పందానికి సంబంధించిన బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ ఈ సినిమాను విడుదల చేయకుండా ఆపాలని కోర్టును ఆశ్రయించారు. 2023లో కోర్టు తాత్కాలికంగా సినిమా విడుదలను నిలిపివేసింది.

ఈ కేసు మదన్ పాండీ, ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్‌కు సంబంధించిన ఆర్థిక ఒప్పందాల వరకు వెళ్లింది. దీంతో మధ్యవర్తిత్వం, చట్టపరమైన సమస్యలు ఇలా చాలా కాలంగా ఈ సినిమా విడుదలను అడ్డుకుంటున్నాయి. ఇదే కారణంగా ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది.

ఈ సినిమాలో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించగా, సిమ్రాన్, ఋతు వర్మ, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ రోజు వచ్చే నిర్ణయంపైనే ఉంది. ఈ తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సాఫీ అవుతుందా లేదా అనే విషయం స్పష్టమవుతుంది.

Advertisment
తాజా కథనాలు