Adarsha Kutumbam: వెంకీ మార్క్ కామెడీతో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ ఎప్పుడంటే?

విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, యోగి బాబు నటిస్తున్న ఈ ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇప్పటికే 40% షూటింగ్ పూర్తయింది.

New Update
Adarsa Kutumbam

Adarsha Kutumbam

Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ (House No: 47) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సినిమా షూటింగ్ దుబాయ్‌లో కూడా చేయాలని యూనిట్ అనుకున్నప్పటికీ, గల్ఫ్ ప్రాంతాల్లో పరిస్థితుల కారణంగా షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేయవలసి వస్తోంది. భద్రతా కారణాలు లేదా ఇతర పరిస్థితుల దృష్ట్యా, దుబాయ్ షెడ్యూల్‌ను మార్చాలా లేదా వాయిదా వేయాలా అనేది దర్శకుడు త్రివిక్రమ్, టీమ్ నిర్ణయించబోతున్నారు.

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, యంగ్ హీరో నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే తమిళ కామెడీ  నటుడు యోగి బాబు కూడా ముఖ్య పాత్రలో నటిస్తాడు. ఇప్పటివరకు సినిమా 40% పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. వెంకీ మార్క్ కామెడీ, ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టేలా సినిమా రూపొందుతోంది.

‘ఆదర్శ కుటుంబం’ ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుంది. టైటిల్ పెద్ద కుటుంబ కథలతో అనుసంధానమయ్యేలా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో భారీ యాక్షన్, ట్విస్టులు, మలుపులు ఉంటాయి. వెంకటేష్- త్రివిక్రమ్ కాంబినేషన్, శ్రీనిధి శెట్టి నటన, సంక్రాంతి తరువాత వచ్చిన విజయాల కారణంగా ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు