JETLEE: "జెట్లీ"కి షాక్.. పర్సంటేజ్ వివాదంతో థియేటర్ల గేట్లు క్లోజ్!

తెలంగాణలో పర్సంటేజ్ షేరింగ్ విధానంపై ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మధ్య వివాదం నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ వ్యతిరేకించడంతో "జెట్లీ" సినిమాకు థియేటర్లలో ఇబ్బందులు వచ్చాయి. AMB, AAA వంటి మల్టీప్లెక్స్‌లలో స్క్రీనింగ్ లేదు.

New Update
JETLEE

JETLEE

JETLEE: తెలంగాణలో సినిమా రంగంలో కొత్త వివాదం మొదలైంది. Telangana State Film Chamber of Commerce తాజాగా రెంటల్ విధానం బదులు పర్సంటేజ్ పద్ధతిలో డబ్బులు పంచుకునే కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఈ మోడల్ ప్రకారం 60-50-40 శాతం షేరింగ్ ఉండాలని సూచించింది.

అయితే Active Producers Guild ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇందులో Mythri Movie Makers కూడా ఉన్నారు.

ఈ వివాదం ప్రభావం ఇప్పుడు "జెట్లీ" సినిమాపై కనిపిస్తోంది. కొన్ని పెద్ద థియేటర్ చైన్లు ఈ సినిమాను ప్రదర్శించడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా AMB Cinemas, AAA Cinemas వంటి ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా స్క్రీనింగ్ లేదు.

దీంతో హైదరాబాద్‌లోని కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు.

ఈ సమస్య కేవలం జెట్లీ సినిమాకే పరిమితం కాదు. ఈ కొత్త విధానాన్ని వ్యతిరేకించిన ఇతర పెద్ద నిర్మాణ సంస్థల సినిమాలు కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

నిర్మాతల అభిప్రాయం ప్రకారం, ఈ శాతం విధానం వల్ల తమ ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది. కానీ ఫిల్మ్ చాంబర్ మాత్రం ఈ విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మళ్లీ మంచి రోజులు వస్తాయని భావిస్తోంది. ఇప్పుడు ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి..

Advertisment
తాజా కథనాలు