/rtv/media/media_files/2026/05/30/ram-charan-peddi-2026-05-30-08-47-13.jpg)
Ram Charan Peddi
Ram Charan Peddi: ప్రస్తుతం టాలీవుడ్కు ఒక భారీ కమర్షియల్ హిట్ చాలా అవసరంగా మారింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తర్వాత ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని పెద్ద హీరోల చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న "పెద్ది" సినిమాపై ఇండస్ట్రీతో పాటు అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు.
‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట్ సతీష్ కిలారు భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార కార్యక్రమాలు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి.
అయితే సినిమా విడుదలకు ముందు ఒక అంశం గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమాచారం ప్రకారం, "పెద్ది" నిర్మాణానికి సుమారు రూ.350 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కానీ థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ తదితర హక్కుల ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ.340 కోట్ల వరకు మాత్రమే రికవరీ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో విడుదలకు ముందే సుమారు రూ.10 కోట్ల లోటు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్ ఆలస్యం కావడం, కొన్ని షెడ్యూల్స్ మారడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని చెబుతున్నారు.
ఈ పరిస్థితిలో నిర్మాతకు పూర్తి స్థాయిలో లాభాలు రావాలంటే సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. రామ్ చరణ్కు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తే పంపిణీదారులు, థియేటర్ యజమానులు సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నిర్మాత పెట్టిన మొత్తం పెట్టుబడి తిరిగి రావాలంటే, అలాగే లాభాలు నమోదు చేయాలంటే "పెద్ది" పెద్ద స్థాయి విజయాన్ని అందుకోవాల్సిందే.
మరి ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగా ఆదరిస్తారో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
Follow Us